వైసీపీలో పరిణామాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవరిని పార్టీ అధిష్టానం పక్కన పెడుతుందో తెలియని పరిస్థితి. ఎవరిని తోసిపుచ్చి.. కొత్తవారికి పగ్గాలు అప్పగిస్తుందో తెలియని వైనం. దీంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసుకున్న ఇంచార్జుల మార్పు నిర్ణయం.. పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఒకవైపు రాజీనామాలు చేసే వారు చేస్తున్న సమయంలో వారిని బుజ్జగించడమో.. లాలించడమో.. వారి డిమండ్లను పరిష్కరించే ప్రయత్నాలు చేయడమో మానేసిన వైసీపీ.. అనూహ్యంగా మరో 11 మంది ఇంచార్జ్లను మార్చేయడం.. కొత్తవారిని నియమించడం ఆఘమేఘాలపై చేసేసింది. ఇక, వీరిలోనూ పెద్దగా ఆరోపణలు లేని వారు ఉన్నారు. అంతేకాదు.. ప్రజల్లో తిరుగుతున్నవారు కూడా ఉన్నారు.
నిజానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న వారిని మార్చలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పులు కూడా చేయాల్సి వస్తే.. అనేక మంది నాయకులు ఎగిరిపోవడం ఖాయం. అయితే.. ఈ దిశగా కూడా వైసీపీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుకున్న నాయకులు పొరుగు పార్టీల వైపు చూస్తున్నారనేది వైసీపీలో జరుగుతున్న చర్చ.
అయితే.. వీరంతట వీరుగా వెళ్తే.. అక్కడ కూడా ప్రాధాన్యం ఉంటుందో ఉండదో అని భావిస్తున్నందునే జంపింగులు ఇంకా స్టార్ట్ కాలేదని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ లేదా జనసేనల నుంచి ఏ మాత్రం కనుసైగ వచ్చినా.. వెంటనే వెళ్లిపోయేందుకు వెయిటింగ్లో ఉన్నారని చాలా మంది నేతలపై చర్చ సాగుతోంది. దాదాపు 50 మంది నాయకులు ఈ జాబితాలో ఉన్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…