Political News

చీరాల హోరు మామూలుగా ఉండేలా లేదే..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల పోరు మామూలుగా ఉండేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ రాజ‌కీయాలు తెర‌మీదికి రావ‌డం.. నాయ‌కులు మార‌డంతో పోరు తీవ్రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ ఇక్క‌డి టికెట్‌ను జ‌న‌సేన‌కు త్యాగం చేసింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చీరాలపై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి.

ఇక‌, వైసీపీ కూడా యువ నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌డం ఖాయ‌మైంద‌ని అంటున్నారు. దీంతో ప్ర‌కాశం జిల్లా లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరిన ఆమంచి స్వాములుకు ఈ టికెట్ కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయ‌న ఇక్క‌డ మాస్ నాయ‌కుడిగా రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఆయ‌న తొలిసారి రంగంలోకి దిగుతున్న స్థానం కావ‌డంతో మాస్ జ‌నాలు ఆయ‌న‌కే జై కొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

పైగా.. ఆర్థికంగానూ స్వాములుకు సాయం చేసేందుకు ప‌లు వ‌ర్గాలు రెడీగా ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు వైసీపీ ఇక్క‌డి ఎమ్మెల్యే క‌రణం బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌కు చీరాల టికెట్ ను ఇటీవ‌ల క‌న్ఫ‌ర్మ్ చేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో యువ నాయ‌కుడిగా వెంక‌టేష్‌కు ఇది మంచి ఛాన్స్‌గా భావిస్తున్నారు. దీంతో త‌న కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవాల‌ని బ‌ల‌రాం కూడా త‌పిస్తున్నారు.

దీంతో అటు స్వాములు, ఇటు వెంక‌టేష్‌(టికెట్లు ఇస్తే)ల మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగుతుంద‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. క‌ర‌ణం పార్టీ మారి(టీడీపీలో గెలిచి వైసీపీకి)న నేప‌థ్యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆయ‌న‌కు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇక‌, వైసీపీలోనూ ఆమంచి వ‌ర్గ‌మే ఉన్న నేప‌థ్యంలో వారు కూడా.. క‌ర‌ణం కుమారుడికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం క‌ష్ట‌మే. దీంతో స్వాములు గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

This post was last modified on December 12, 2023 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

40 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago