ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నికల పోరు మామూలుగా ఉండేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. గతానికి భిన్నంగా ఇక్కడ రాజకీయాలు తెరమీదికి రావడం.. నాయకులు మారడంతో పోరు తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ ఇక్కడి టికెట్ను జనసేనకు త్యాగం చేసిందన్న వార్తల నేపథ్యంలో చీరాలపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఇక, వైసీపీ కూడా యువ నాయకుడికి టికెట్ ఇవ్వడం ఖాయమైందని అంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లా లో చీరాల నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జనసేనలో చేరిన ఆమంచి స్వాములుకు ఈ టికెట్ కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన ఇక్కడ మాస్ నాయకుడిగా రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఆయన తొలిసారి రంగంలోకి దిగుతున్న స్థానం కావడంతో మాస్ జనాలు ఆయనకే జై కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పైగా.. ఆర్థికంగానూ స్వాములుకు సాయం చేసేందుకు పలు వర్గాలు రెడీగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు వైసీపీ ఇక్కడి ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్కు చీరాల టికెట్ ను ఇటీవల కన్ఫర్మ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో యువ నాయకుడిగా వెంకటేష్కు ఇది మంచి ఛాన్స్గా భావిస్తున్నారు. దీంతో తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని బలరాం కూడా తపిస్తున్నారు.
దీంతో అటు స్వాములు, ఇటు వెంకటేష్(టికెట్లు ఇస్తే)ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందనే ప్రచారం ఉంది. అయితే.. కరణం పార్టీ మారి(టీడీపీలో గెలిచి వైసీపీకి)న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు.. ఆయనకు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇక, వైసీపీలోనూ ఆమంచి వర్గమే ఉన్న నేపథ్యంలో వారు కూడా.. కరణం కుమారుడికి మద్దతు తెలపడం కష్టమే. దీంతో స్వాములు గెలుపు నల్లేరుపై నడకే అవుతుందనే అంచనాలు వస్తున్నాయి.
This post was last modified on December 12, 2023 6:51 am
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…