Political News

చీరాల హోరు మామూలుగా ఉండేలా లేదే..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల పోరు మామూలుగా ఉండేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ రాజ‌కీయాలు తెర‌మీదికి రావ‌డం.. నాయ‌కులు మార‌డంతో పోరు తీవ్రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ ఇక్క‌డి టికెట్‌ను జ‌న‌సేన‌కు త్యాగం చేసింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చీరాలపై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి.

ఇక‌, వైసీపీ కూడా యువ నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌డం ఖాయ‌మైంద‌ని అంటున్నారు. దీంతో ప్ర‌కాశం జిల్లా లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరిన ఆమంచి స్వాములుకు ఈ టికెట్ కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయ‌న ఇక్క‌డ మాస్ నాయ‌కుడిగా రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఆయ‌న తొలిసారి రంగంలోకి దిగుతున్న స్థానం కావ‌డంతో మాస్ జ‌నాలు ఆయ‌న‌కే జై కొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

పైగా.. ఆర్థికంగానూ స్వాములుకు సాయం చేసేందుకు ప‌లు వ‌ర్గాలు రెడీగా ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు వైసీపీ ఇక్క‌డి ఎమ్మెల్యే క‌రణం బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌కు చీరాల టికెట్ ను ఇటీవ‌ల క‌న్ఫ‌ర్మ్ చేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో యువ నాయ‌కుడిగా వెంక‌టేష్‌కు ఇది మంచి ఛాన్స్‌గా భావిస్తున్నారు. దీంతో త‌న కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవాల‌ని బ‌ల‌రాం కూడా త‌పిస్తున్నారు.

దీంతో అటు స్వాములు, ఇటు వెంక‌టేష్‌(టికెట్లు ఇస్తే)ల మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగుతుంద‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. క‌ర‌ణం పార్టీ మారి(టీడీపీలో గెలిచి వైసీపీకి)న నేప‌థ్యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆయ‌న‌కు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇక‌, వైసీపీలోనూ ఆమంచి వ‌ర్గ‌మే ఉన్న నేప‌థ్యంలో వారు కూడా.. క‌ర‌ణం కుమారుడికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం క‌ష్ట‌మే. దీంతో స్వాములు గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

This post was last modified on December 12, 2023 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago