Political News

కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కెసిఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. కేసీఆర్ కు విజయవంతంగా వైద్యులు తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే వాకర్ సాయంతో కేసీఆర్ ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ పూర్తిగా కోరుకునేందుకు మరో ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్, వైద్యులను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను పరామర్శించానని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, కోలుకున్న తర్వాత అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు కేసీఆర్ సూచనలు కూడా అవసరమని రేవంత్ అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముందని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ త్వరలోనే కోలుకొని శాసనసభకు రావాలని ఆయనను కోరానని రేవంత్ అన్నారు. ఏదేమైనా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించడం, ఆయన కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించారని సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ ను రేవంత్ పరామర్శించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on December 10, 2023 5:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

52 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago