Political News

నెక్స్ట్ టార్గెట్ ధరణేనా?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. ముందు విద్యుత్ శాఖ వ్యవహారాలపై సమీక్ష మొదలుపెట్టగానే అందులోను అవకతవకలు బయటపడ్డాయి. సమీక్షలో ఉన్నతాధికారులు బయటపెట్టిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో ఉందని తేలింది. అలాగే జెన్ కో, ట్రాన్స్ కో లో జరిగిన అనేక అక్రమాలు కూడా మెల్లిగా బయటపడుతున్నాయి. విద్యుత్ శాఖ సమీక్ష తాలూకు వేడి మెల్లిగా మొదలైంది.

ఈ వేడి ఇలాగ మొదలవ్వగానే వెంటనే రెండో టార్గెట్ కూడా మొదలైపోయినట్లుంది. ఇంతకీ రెండో టార్గెట్ ఏమిటంటే ధరణి పోర్టల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా పెద్దఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు చాలాకాలంగా ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన వాళ్ళతో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా పోర్టల్ ను అడ్డుపెట్టుకుని వందలు, వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు రేవంత్ రెడ్డితో సహా చాలామంది నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

వీటన్నింటికీ పరాకాష్టగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ మధ్యలో పెద్దఎత్తున అడ్డదారిలో వందలాది ఎకరాలు అక్రమంగా అధికార పార్టీ నేతల పేరుతో బదిలీ అయినట్లు బయటపడింది. అందుకనే దానికి బాధ్యులైన కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. గడచిన పదేళ్ళలో ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు భూ అక్రమాలకు  పాల్పడినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

అందుకనే నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు పూర్తవ్వగానే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధరణి పోర్టల్ లో జరిగిన అక్రమాలపై సమీక్ష పెట్టుకున్నట్లు సమాచారం. ముందుగా రెవిన్యు మంత్రితో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ప్రాధమిక సమాచారం రెడీ చేయమని చెప్పారట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకమైన కారణాల్లో ధరణి పోర్టల్లో అవకతవకలు కూడా ప్రధానమైనదనే చెప్పాలి. మరి ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి సమీక్షలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.

This post was last modified on December 10, 2023 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

34 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

1 hour ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago