Political News

మంత్రిగా ఉన్న‌ప్పుడు.. లంచాలు తీసుకున్నా: బాలినేని

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రిగా ఉన్న‌ప్పుడు తాను ఏదైనా ప‌నిమీద వ‌చ్చిన వారు డ‌బ్బులు ఇస్తే(లంచాలు) తీసుకు న్నాన‌ని చెప్పారు. అంతేకాదు.. తాను తీసుకున్న సొమ్ము వెయ్యి కోట్లు ఉంటుంద‌ని చెబుతున్నార‌ని.. అంత లేద‌ని.. కావాలంటే లెక్కేసుకోవ‌చ్చ‌వ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడు తూ… సీఎం జ‌గ‌న్‌పై నా విమ‌ర్శ‌లు గుప్పించారు.

30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది అని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఒంగోలు నుంచే పోటీచేస్తాన‌ని, మరో నియోజకవర్గానికి వెళ్లబోన‌ని బాలినేని వెల్ల‌డించారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాన‌న్నారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పిన‌ట్టు తెలిపారు.

తాను నీతి మంతుడినని చెప్పడం లేదన్న బాలినేని.. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నాన‌న్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌కు త‌మ‌కు, త‌మ కుటుంబానికి ఎన‌లేని అభిమానం ఉంద‌ని, ముఖ్యంగా త‌మ కుమారుడు అయితే.. సీఎం జ‌గ‌న్ అంటే ప్రాణం పెడతాడ‌ని.. కానీ, ఎంత సేపూ మేమే పూసుకుంటున్నాం కానీ.. ఆయ‌న వైపు కూడా అభిమానం ఉండాలి క‌దా.. అదే లేదు! అని బాలినేని తేల్చి చెప్పారు.

ఇక‌, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టానని బాలినేని మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అయితే.. తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగిన త‌మ కుమారుడు మాత్రం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడని.. దీంతో పందెం రద్దుచేసుకున్నాన‌ని వెల్ల‌డించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు చెబుతున్న‌ట్టు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వ‌స్తోంద‌ని మండిపడ్డారు.

This post was last modified on December 9, 2023 11:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

30 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago