Political News

మంత్రిగా ఉన్న‌ప్పుడు.. లంచాలు తీసుకున్నా: బాలినేని

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రిగా ఉన్న‌ప్పుడు తాను ఏదైనా ప‌నిమీద వ‌చ్చిన వారు డ‌బ్బులు ఇస్తే(లంచాలు) తీసుకు న్నాన‌ని చెప్పారు. అంతేకాదు.. తాను తీసుకున్న సొమ్ము వెయ్యి కోట్లు ఉంటుంద‌ని చెబుతున్నార‌ని.. అంత లేద‌ని.. కావాలంటే లెక్కేసుకోవ‌చ్చ‌వ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడు తూ… సీఎం జ‌గ‌న్‌పై నా విమ‌ర్శ‌లు గుప్పించారు.

30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది అని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఒంగోలు నుంచే పోటీచేస్తాన‌ని, మరో నియోజకవర్గానికి వెళ్లబోన‌ని బాలినేని వెల్ల‌డించారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాన‌న్నారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పిన‌ట్టు తెలిపారు.

తాను నీతి మంతుడినని చెప్పడం లేదన్న బాలినేని.. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నాన‌న్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌కు త‌మ‌కు, త‌మ కుటుంబానికి ఎన‌లేని అభిమానం ఉంద‌ని, ముఖ్యంగా త‌మ కుమారుడు అయితే.. సీఎం జ‌గ‌న్ అంటే ప్రాణం పెడతాడ‌ని.. కానీ, ఎంత సేపూ మేమే పూసుకుంటున్నాం కానీ.. ఆయ‌న వైపు కూడా అభిమానం ఉండాలి క‌దా.. అదే లేదు! అని బాలినేని తేల్చి చెప్పారు.

ఇక‌, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టానని బాలినేని మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అయితే.. తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగిన త‌మ కుమారుడు మాత్రం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడని.. దీంతో పందెం రద్దుచేసుకున్నాన‌ని వెల్ల‌డించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు చెబుతున్న‌ట్టు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వ‌స్తోంద‌ని మండిపడ్డారు.

This post was last modified on December 9, 2023 11:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

4 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

4 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

5 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

5 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

6 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

8 hours ago