Political News

మంత్రిగా ఉన్న‌ప్పుడు.. లంచాలు తీసుకున్నా: బాలినేని

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రిగా ఉన్న‌ప్పుడు తాను ఏదైనా ప‌నిమీద వ‌చ్చిన వారు డ‌బ్బులు ఇస్తే(లంచాలు) తీసుకు న్నాన‌ని చెప్పారు. అంతేకాదు.. తాను తీసుకున్న సొమ్ము వెయ్యి కోట్లు ఉంటుంద‌ని చెబుతున్నార‌ని.. అంత లేద‌ని.. కావాలంటే లెక్కేసుకోవ‌చ్చ‌వ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడు తూ… సీఎం జ‌గ‌న్‌పై నా విమ‌ర్శ‌లు గుప్పించారు.

30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది అని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఒంగోలు నుంచే పోటీచేస్తాన‌ని, మరో నియోజకవర్గానికి వెళ్లబోన‌ని బాలినేని వెల్ల‌డించారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాన‌న్నారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పిన‌ట్టు తెలిపారు.

తాను నీతి మంతుడినని చెప్పడం లేదన్న బాలినేని.. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నాన‌న్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌కు త‌మ‌కు, త‌మ కుటుంబానికి ఎన‌లేని అభిమానం ఉంద‌ని, ముఖ్యంగా త‌మ కుమారుడు అయితే.. సీఎం జ‌గ‌న్ అంటే ప్రాణం పెడతాడ‌ని.. కానీ, ఎంత సేపూ మేమే పూసుకుంటున్నాం కానీ.. ఆయ‌న వైపు కూడా అభిమానం ఉండాలి క‌దా.. అదే లేదు! అని బాలినేని తేల్చి చెప్పారు.

ఇక‌, తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టానని బాలినేని మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అయితే.. తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగిన త‌మ కుమారుడు మాత్రం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడని.. దీంతో పందెం రద్దుచేసుకున్నాన‌ని వెల్ల‌డించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు చెబుతున్న‌ట్టు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వ‌స్తోంద‌ని మండిపడ్డారు.

This post was last modified on December 9, 2023 11:16 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago