బీఆర్ఎస్ ఓటమితో సుకేష్ చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఢిల్లీలోని తీహార్ జైలు నుండి ఒక లేఖ విడుదలచేశారు. అందులో కేటీయార్, కవితలను ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేశారు. దురాశ, అవినీతి వల్లే తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని సుకేష్ తేల్చేశాడు. తోందరలోనే అహంకారం, అత్యశ అంతమవుతుందని తాను ముందుగానే చెప్పానని సుకేష్ గుర్తుచేశాడు. చేసిన అవినీతికి తండ్రి, కూతుర్లు చట్టాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. చాలా కాలంగా కేటీయార్, కవితకు సుకేష్ మధ్య లేఖల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
అనేక ఆరోపణలు ఎదుర్కొంటు మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఇరుక్కుని ప్రస్తుతం సుకేష్ జైలులో ఉన్నాడు. సడెన్ గా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో టార్గెట్ చేయటంతో సంచలనాలు మొదలయ్యాయి. కవితకు మద్దతుగా కేటీయార్ రంగంలోకి దిగటంతో ఇద్దరిపైనా సుకేష్ అవినీతి ఆరోపణలతో రెచ్చిపోయాడు. లిక్కర్ స్కామ్ లో కవితకు తాను రు. 16 కోట్లు ఇచ్చానని, పార్టీ ఆపీసులోని ఒక కారులో ఉంచిన డబ్బును కవిత తీసుకున్నట్లుగా సుకేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలమైంది.
అయితే ఆ ఆరోపణలను కవిత కొట్టిపడేశారు. కానీ సుకుష్ అందుకు అంగీకరించకుండా తన ఆరోపణలకు మద్దతుగా తనకు కవితకు మధ్య డబ్బు విషయంలో జరిగిన కొన్ని వాట్సప్ స్క్రీన్ షాట్లను మీడియాకు రిలీజ్ చేశాడు. డబ్బు విషయంతో పాటు ఇతరత్రా చాటింగులను కూడా రిలీజ్ చేశాడు. దాంతో వాళ్ళిద్దరికి మంచి సన్నిహితం ఉన్న విషయం బయటపడింది. అప్పటినుండి సుకేష్ ఆరోపణలకు కవిత స్పందించటం మానుకున్నారు.
తర్వాత ఏమైందో ఏమో సుకేష్ కూడా మౌనంగా ఉండిపోయారు. అలాంటిది ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే సడెన్ గా సుకేష్ మళ్ళీ పిక్చర్లోకి వచ్చారు. కేసీయార్ ఓటమి, బీఆర్ఎస్ ఓటమిపై పెద్ద లేఖను విడుదల చేయటం ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సుకేష్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అసలే ఓటమి బాధలో ఉన్న కేసీయార్ కుటుంబాన్ని సుకేష్ టార్గెట్ చేసుకోవటం, సెటైర్లు వేయటంతో బహుశా వాళ్ళు మండిపోతుండచ్చు. మరీ లేఖకైనా సమాధానం ఇస్తారా లేదా అన్నది చూడాలి.
This post was last modified on December 9, 2023 11:09 am
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…