బీఆర్ఎస్ ఓటమితో సుకేష్ చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఢిల్లీలోని తీహార్ జైలు నుండి ఒక లేఖ విడుదలచేశారు. అందులో కేటీయార్, కవితలను ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేశారు. దురాశ, అవినీతి వల్లే తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని సుకేష్ తేల్చేశాడు. తోందరలోనే అహంకారం, అత్యశ అంతమవుతుందని తాను ముందుగానే చెప్పానని సుకేష్ గుర్తుచేశాడు. చేసిన అవినీతికి తండ్రి, కూతుర్లు చట్టాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. చాలా కాలంగా కేటీయార్, కవితకు సుకేష్ మధ్య లేఖల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
అనేక ఆరోపణలు ఎదుర్కొంటు మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఇరుక్కుని ప్రస్తుతం సుకేష్ జైలులో ఉన్నాడు. సడెన్ గా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో టార్గెట్ చేయటంతో సంచలనాలు మొదలయ్యాయి. కవితకు మద్దతుగా కేటీయార్ రంగంలోకి దిగటంతో ఇద్దరిపైనా సుకేష్ అవినీతి ఆరోపణలతో రెచ్చిపోయాడు. లిక్కర్ స్కామ్ లో కవితకు తాను రు. 16 కోట్లు ఇచ్చానని, పార్టీ ఆపీసులోని ఒక కారులో ఉంచిన డబ్బును కవిత తీసుకున్నట్లుగా సుకేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలమైంది.
అయితే ఆ ఆరోపణలను కవిత కొట్టిపడేశారు. కానీ సుకుష్ అందుకు అంగీకరించకుండా తన ఆరోపణలకు మద్దతుగా తనకు కవితకు మధ్య డబ్బు విషయంలో జరిగిన కొన్ని వాట్సప్ స్క్రీన్ షాట్లను మీడియాకు రిలీజ్ చేశాడు. డబ్బు విషయంతో పాటు ఇతరత్రా చాటింగులను కూడా రిలీజ్ చేశాడు. దాంతో వాళ్ళిద్దరికి మంచి సన్నిహితం ఉన్న విషయం బయటపడింది. అప్పటినుండి సుకేష్ ఆరోపణలకు కవిత స్పందించటం మానుకున్నారు.
తర్వాత ఏమైందో ఏమో సుకేష్ కూడా మౌనంగా ఉండిపోయారు. అలాంటిది ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే సడెన్ గా సుకేష్ మళ్ళీ పిక్చర్లోకి వచ్చారు. కేసీయార్ ఓటమి, బీఆర్ఎస్ ఓటమిపై పెద్ద లేఖను విడుదల చేయటం ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సుకేష్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అసలే ఓటమి బాధలో ఉన్న కేసీయార్ కుటుంబాన్ని సుకేష్ టార్గెట్ చేసుకోవటం, సెటైర్లు వేయటంతో బహుశా వాళ్ళు మండిపోతుండచ్చు. మరీ లేఖకైనా సమాధానం ఇస్తారా లేదా అన్నది చూడాలి.
This post was last modified on December 9, 2023 11:09 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…