తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతుల తీసుకున్న మరుసటి రోజే.. ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. అనుకున్న విధంగానే శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్(ప్రగతి భవన్)లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్రజలు అర్జీలు పట్టుకుని ఉదయం 6 గంటలకే క్యూలలో కిక్కిరిసిపోయారు.
కాగా, ఈ ప్రజాదర్బార్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రబుత్వ కాన్వాయ్ని పక్కన పెట్టి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి ప్రజాభవన్కు చేరుకున్నారు. అనంతరం ప్రజాదర్బార్ మొదలైంది. సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్, మంత్రులు స్వయంగా అర్జీలు స్వీకరించారు.
మరోవైపు ప్రజాదర్బార్కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. ప్రజాదర్బార్కు వస్తున్న వారిలో వికలాంగులు కూడా ఉన్నారని సీఎం రేవంత్కు సమాచారం రావడంతో వెనువెంటనే.. అక్కడ.. వికలాంగుల కోసం.. బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు. ఎవరూ ఇబ్బంది పడకూడదని.. ప్రజాదర్బార్కు సమస్యలతో వచ్చి.. పరిష్కారాలతో వెళ్లేలా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటికప్పుడు పరిస్కారం అయ్యే వాటిని అధికారులు అక్కడే పరిష్కరిస్కరిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 8, 2023 12:40 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…