Political News

‘ప్ర‌జాద‌ర్భార్‌’లో మెరుపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తుల తీసుకున్న మ‌రుస‌టి రోజే.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తాన‌ని ఎల్బీ స్టేడియం వేదిక‌గా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనుకున్న విధంగానే శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ్యోతిరావు పూలే ప్ర‌జా భ‌వ‌న్‌(ప్ర‌గ‌తి భ‌వ‌న్‌)లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించారు. ఈ ద‌ర్బార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్ర‌జ‌లు అర్జీలు ప‌ట్టుకుని ఉద‌యం 6 గంట‌ల‌కే క్యూల‌లో కిక్కిరిసిపోయారు.

కాగా, ఈ ప్ర‌జాద‌ర్బార్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌బుత్వ కాన్వాయ్‌ని ప‌క్క‌న పెట్టి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాదర్బార్‌ మొదలైంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్, మంత్రులు స్వ‌యంగా అర్జీలు స్వీకరించారు.

మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌స్తున్న వారిలో విక‌లాంగులు కూడా ఉన్నార‌ని సీఎం రేవంత్‌కు స‌మాచారం రావ‌డంతో వెనువెంట‌నే.. అక్క‌డ‌.. విక‌లాంగుల కోసం.. బ్యాట‌రీ వాహ‌నాల‌ను ఏర్పాటు చేశారు. ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని.. ప్ర‌జాద‌ర్బార్‌కు స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చి.. ప‌రిష్కారాల‌తో వెళ్లేలా వ్య‌వ‌హ‌రించాల‌ని ఉన్న‌తాధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్కారం అయ్యే వాటిని అధికారులు అక్క‌డే ప‌రిష్క‌రిస్క‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 8, 2023 12:40 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

8 minutes ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

14 minutes ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

2 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

3 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

4 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

4 hours ago