Political News

‘ప్ర‌జాద‌ర్భార్‌’లో మెరుపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తుల తీసుకున్న మ‌రుస‌టి రోజే.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తాన‌ని ఎల్బీ స్టేడియం వేదిక‌గా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనుకున్న విధంగానే శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ్యోతిరావు పూలే ప్ర‌జా భ‌వ‌న్‌(ప్ర‌గ‌తి భ‌వ‌న్‌)లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించారు. ఈ ద‌ర్బార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్ర‌జ‌లు అర్జీలు ప‌ట్టుకుని ఉద‌యం 6 గంట‌ల‌కే క్యూల‌లో కిక్కిరిసిపోయారు.

కాగా, ఈ ప్ర‌జాద‌ర్బార్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌బుత్వ కాన్వాయ్‌ని ప‌క్క‌న పెట్టి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాదర్బార్‌ మొదలైంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్, మంత్రులు స్వ‌యంగా అర్జీలు స్వీకరించారు.

మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌స్తున్న వారిలో విక‌లాంగులు కూడా ఉన్నార‌ని సీఎం రేవంత్‌కు స‌మాచారం రావ‌డంతో వెనువెంట‌నే.. అక్క‌డ‌.. విక‌లాంగుల కోసం.. బ్యాట‌రీ వాహ‌నాల‌ను ఏర్పాటు చేశారు. ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని.. ప్ర‌జాద‌ర్బార్‌కు స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చి.. ప‌రిష్కారాల‌తో వెళ్లేలా వ్య‌వ‌హ‌రించాల‌ని ఉన్న‌తాధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్కారం అయ్యే వాటిని అధికారులు అక్క‌డే ప‌రిష్క‌రిస్క‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

5 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

5 hours ago