Political News

‘ప్ర‌జాద‌ర్భార్‌’లో మెరుపులు.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తుల తీసుకున్న మ‌రుస‌టి రోజే.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తాన‌ని ఎల్బీ స్టేడియం వేదిక‌గా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనుకున్న విధంగానే శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ్యోతిరావు పూలే ప్ర‌జా భ‌వ‌న్‌(ప్ర‌గ‌తి భ‌వ‌న్‌)లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించారు. ఈ ద‌ర్బార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్ర‌జ‌లు అర్జీలు ప‌ట్టుకుని ఉద‌యం 6 గంట‌ల‌కే క్యూల‌లో కిక్కిరిసిపోయారు.

కాగా, ఈ ప్ర‌జాద‌ర్బార్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌బుత్వ కాన్వాయ్‌ని ప‌క్క‌న పెట్టి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రజాదర్బార్‌ మొదలైంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్, మంత్రులు స్వ‌యంగా అర్జీలు స్వీకరించారు.

మరోవైపు ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజాభవన్‌కు భారీగా ప్రజలు చేరుకున్నారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌జాద‌ర్బార్‌కు వ‌స్తున్న వారిలో విక‌లాంగులు కూడా ఉన్నార‌ని సీఎం రేవంత్‌కు స‌మాచారం రావ‌డంతో వెనువెంట‌నే.. అక్క‌డ‌.. విక‌లాంగుల కోసం.. బ్యాట‌రీ వాహ‌నాల‌ను ఏర్పాటు చేశారు. ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని.. ప్ర‌జాద‌ర్బార్‌కు స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చి.. ప‌రిష్కారాల‌తో వెళ్లేలా వ్య‌వ‌హ‌రించాల‌ని ఉన్న‌తాధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్కారం అయ్యే వాటిని అధికారులు అక్క‌డే ప‌రిష్క‌రిస్క‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 8, 2023 12:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

21 minutes ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

2 hours ago

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

2 hours ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

3 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

4 hours ago

సుజీత్‌కు ప‌వ‌న్ కారు ఇచ్చింది అందుకా?

ఒక సినిమా పెద్ద హిట్ట‌యితే ద‌ర్శ‌కుడికి నిర్మాత కారు ఇవ్వ‌డం చాలా సంద‌ర్భాల్లో చూశాం. ఈ మ‌ధ్య ఇదొక ట్రెండుగా…

4 hours ago