Political News

తొలి కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఇవే

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా ఆయనతోపాటు 11 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. మంత్రులకు శాఖలను కూడా రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి టీం తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది.

రేవంత్ అధ్యక్షతన కొలువుదీరిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలో రెండు హామీలను మొదలు పెట్టాలని తీర్మానించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

దాంతోపాటు ఉచిత విద్యుత్ హామీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారని శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు‌. ఈనెల తొమ్మిదో తారీకున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభలో ప్రమాణ స్వీకారం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి అసెంబ్లీ సమావేశం ఆరోజే జరగబోతుందని అన్నారు. సీనియర్ శాసనసభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటామని శ్రీధర్ బాబు చెప్పారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 6 గ్యారెంటీల అమలుపై చర్చించామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.

This post was last modified on December 8, 2023 8:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరంతా?’ – పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…

2 hours ago

రాకా సంగీతానికి పెద్ద ఛాలెంజ్ ఉంది

అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్…

2 hours ago

యువ హీరోకి బాబాయితో చెడిందా

యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను…

2 hours ago

సైకిల్ ఎక్కిన వైసీపీ భూమన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా… జగన్ కోసం ఏమైనా చేసేందుకు అనునిత్యం సిద్ధంగా…

3 hours ago

జాతీయ రాజకీయాలపై రేవంత్ కన్ను

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన…

3 hours ago

మీరంతా బొద్దింక‌లు.. ప‌రాన్న జీవులు: సీజేఐ తీవ్ర వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్స‌ర్లు, స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప్ర‌భుత్వాన్ని, కోర్టుల‌ను ప్ర‌శ్నించేవారిపై…

3 hours ago