తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా ఆయనతోపాటు 11 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. మంత్రులకు శాఖలను కూడా రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి టీం తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది.
రేవంత్ అధ్యక్షతన కొలువుదీరిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలో రెండు హామీలను మొదలు పెట్టాలని తీర్మానించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
దాంతోపాటు ఉచిత విద్యుత్ హామీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారని శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈనెల తొమ్మిదో తారీకున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభలో ప్రమాణ స్వీకారం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి అసెంబ్లీ సమావేశం ఆరోజే జరగబోతుందని అన్నారు. సీనియర్ శాసనసభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటామని శ్రీధర్ బాబు చెప్పారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 6 గ్యారెంటీల అమలుపై చర్చించామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.
This post was last modified on December 8, 2023 8:39 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…