వచ్చే ఏడాది ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకుంటే.. ముఖ్యమంత్రీ పీఠాన్ని పంచుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. తాజాగా విశాఖపట్నంలో జనసేన నాయకుల ఆధ్వర్యం లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు.. జనసేన తీర్థం పుచ్చుకు న్నారు.
ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ‘పవన్ సీఎం.. పవన్ సీఎం’ అంటూ.. పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. నినాదాలు ఆపాలని పవన్ సూచించినా.. కార్యకర్తలు ఆగలేదు. దీంతో ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నవారు.. నన్ను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. గతంలో గాజువాక నుంచి తాను పోటీ చేస్తే.. కనీసం గెలిపించలేకపోయారని వ్యాఖ్యానించారు. అయిందేదో అయిపోయిందని.. పవన్ అన్నారు.
కనీసం వచ్చే ఎన్నికలలో అయినా.. జనసేన ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ భారీ మెజారిటీతో గెలిపిస్తే.. తనను ముఖ్యమంత్రిగా చూసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. “మన బలం ఏంటో చూపించాలి. బలం లేకుండా.. మనకు అది కావాలి.. ఇది కావాలి అని అడిగితే ధర్మంకాదు. మీరు జనసేనను భారీ మెజారిటీతో గెలిపించడం.. ఒక్క నాయకుడు కూడా ఓడిపోవడానికి వీల్లేదు. అప్పుడు మీరు కోరుకున్నట్టు సీఎం సీటును పంచుకుంటాం. ఈ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తున్నా” అని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో కార్యకర్తలు శాంతించారు.
This post was last modified on December 7, 2023 8:33 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…