తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓటమి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయకులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
తాజాగా బేటీకి అందరూ రావాలని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను తప్పిస్తే.. మిగిలిన వారిలో మరో ముగ్గరు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మల్లారెడ్డి(మేడ్చల్), రాజశేఖ ర్రెడ్డి(మల్కాజిగిరి), సుదీర్రెడ్డి(ఎల్బీనగర్)లు సమావేశానికి హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశానికి వారు గైర్హాజరు కావడంతో పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి.
ఎవరు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే లక్షణం ఉన్న మల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుందని బీఆర్ ఎస్ సైతం అంచనా వేస్తుండడం గమనార్హం.
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…