తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓటమి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయకులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
తాజాగా బేటీకి అందరూ రావాలని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను తప్పిస్తే.. మిగిలిన వారిలో మరో ముగ్గరు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మల్లారెడ్డి(మేడ్చల్), రాజశేఖ ర్రెడ్డి(మల్కాజిగిరి), సుదీర్రెడ్డి(ఎల్బీనగర్)లు సమావేశానికి హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశానికి వారు గైర్హాజరు కావడంతో పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి.
ఎవరు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే లక్షణం ఉన్న మల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుందని బీఆర్ ఎస్ సైతం అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on December 4, 2023 4:24 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…