Political News

కేటీఆర్ భేటీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా?

తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓట‌మి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయ‌కుల‌ను పార్టీ కార్యాల‌యానికి పిలిపించుకుని భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

తాజాగా బేటీకి అంద‌రూ రావాల‌ని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను త‌ప్పిస్తే.. మిగిలిన వారిలో మ‌రో ముగ్గ‌రు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మ‌ల్లారెడ్డి(మేడ్చ‌ల్‌), రాజ‌శేఖ ర్‌రెడ్డి(మ‌ల్కాజిగిరి), సుదీర్‌రెడ్డి(ఎల్బీన‌గ‌ర్‌)లు స‌మావేశానికి హాజ‌రు కాలేదు. కీల‌క‌మైన ఈ స‌మావేశానికి వారు గైర్హాజ‌రు కావ‌డంతో పార్టీలో లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి.

ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే ల‌క్షణం ఉన్న మ‌ల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చ‌ర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మ‌రోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుంద‌ని బీఆర్ ఎస్ సైతం అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 4, 2023 4:24 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

7 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

7 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

7 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

9 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

9 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

10 hours ago