Political News

కేటీఆర్ భేటీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా?

తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓట‌మి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయ‌కుల‌ను పార్టీ కార్యాల‌యానికి పిలిపించుకుని భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

తాజాగా బేటీకి అంద‌రూ రావాల‌ని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను త‌ప్పిస్తే.. మిగిలిన వారిలో మ‌రో ముగ్గ‌రు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మ‌ల్లారెడ్డి(మేడ్చ‌ల్‌), రాజ‌శేఖ ర్‌రెడ్డి(మ‌ల్కాజిగిరి), సుదీర్‌రెడ్డి(ఎల్బీన‌గ‌ర్‌)లు స‌మావేశానికి హాజ‌రు కాలేదు. కీల‌క‌మైన ఈ స‌మావేశానికి వారు గైర్హాజ‌రు కావ‌డంతో పార్టీలో లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి.

ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే ల‌క్షణం ఉన్న మ‌ల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చ‌ర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మ‌రోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుంద‌ని బీఆర్ ఎస్ సైతం అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 4, 2023 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

2 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

7 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

8 hours ago

రాజ్యసభలో రచ్చ.. ఎవరీ రేణుక చౌదరి?

తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.. రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే…

9 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

9 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

9 hours ago