తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓటమి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయకులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
తాజాగా బేటీకి అందరూ రావాలని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను తప్పిస్తే.. మిగిలిన వారిలో మరో ముగ్గరు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మల్లారెడ్డి(మేడ్చల్), రాజశేఖ ర్రెడ్డి(మల్కాజిగిరి), సుదీర్రెడ్డి(ఎల్బీనగర్)లు సమావేశానికి హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశానికి వారు గైర్హాజరు కావడంతో పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి.
ఎవరు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే లక్షణం ఉన్న మల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుందని బీఆర్ ఎస్ సైతం అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on December 4, 2023 4:24 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…