తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్.. డీజీపీ .. అంజనీకుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఏంటీ కారణం?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలోనే డీజీపీ అంజనీ కుమార్.. నేరుగా కాంగ్రెస్ పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. ఆయన శుభాకాంక్షలు చెప్పారు. పుష్పగుచ్ఛం అందించారు. నిజానికి అప్పటికి ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. ఎన్నికల నిబంధనల మేరకు.. ఫలితాలు పూర్తిగా వచ్చాక.. కేంద్ర ఎన్నికల సంఘం వాటిని డిక్లేర్ చేసిన తర్వాత.. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు అన్నది ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాక మాత్రమే అధికారులు రాజకీయ నేతలను కలుసుకోవాల్సి ఉంది.
అయితే.. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడుతున్న సమయంలోనే అంజనీ కుమార్.. మరో డీజీపీ(శాంతి భద్రతలు)తో కలిసి.. రేవంత్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటికి.. కాంగ్రెస్ లీడ్లో ఉంది. దీంతో కాంగ్రెస్ గెలిచేస్తుందన్న సంకేతాలు కూడా వచ్చాయి.ఈక్రమంలో అందరికన్నా ముందుగానే.. డీజీపీ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇది అన్ని మాధ్యమాల్లోనూ వైరల్ అయింది. దీనిని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం.. డీజీపీపై వేటు వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను…
తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ…
ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు…
పార్టీలో కార్యకర్తల స్థాయిలో ఉన్నవారు.. పార్టీ పెద్దలతో ఫొటోలు అంటే.. ఎంతగా ఎగబడతారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా జాతీయ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు…
తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…