వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పొత్తు విషయంలో జనసేన నాయకులు చాలా మంది విభేదిస్తున్నారు. ఎంతో మంది పార్టీ కోసం పనిచేశారని.. ఎంతో ఖర్చు కూడా చేశారని.. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించామని.. ఇప్పుడు కాదని పొత్తు పెట్టుకుని.. సీఎం సీటును వదులుకుంటారా? అనేదివారి భావన. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ సమావేశాలు దాదాపు విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా జనసేన నాయకులతో పవన్ భేటీ అవుతున్నారు. బుజ్జగింపు రాజకీయాలకు తెరదీశారు. తాను ఏ పరిస్థితిలో పొత్తులకు వెళ్లిందీ వారికి చెబుతున్నారు. అదేసమయంలో పదవులపై తనకు ఆశలు లేవని కూడా వారికి వెల్లడించారు. మీరు కూడా పదవులు ఆశించొద్దని చెప్పారు. తాజాగా.. మరోసారి టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందీ… ఆయన వివరించారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారని పవన్ చెప్పారు. అయినా.. పార్టీని నడిపిస్తూనే ఉన్నానని.. ఎంతో కష్టపడుతున్నానని చెప్పారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోలేదని పవన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అలా తీసుకుని ఉంటే.. పార్టీ మరింత బలంగా ఉండేదని చెప్పారు.
అదే కనుక జరిగి ఉంటే(ఇతర పార్టీల నుంచి జనసేనలోకి ఆకర్ష్ మంత్రం పఠించి.. చేరికలను ప్రోత్సహించి ఉంటే) 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఉండేవారమని జనసేన నాయకులకు నచ్చజెప్పారు. కానీ ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోలేదని తెల్చిచెప్పారు. అందుకే.. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నామని.. దీనిని నాయకులు సహృదయంతో అర్ధం చేసుకుని పార్టీకి సహకరించాలని పవన్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్ఎస్ మూడో ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జనసేన కుటుంబం తనకు అండగా ఉందని వెల్లడించారు.
This post was last modified on December 2, 2023 11:14 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…