Political News

‘వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంది!’

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీకి.. వైసీపీకి చెందిన నాయ‌కులు జై కొట్టారు. ప‌లు జిల్లాల‌కు చెందిన క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తాజాగా జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన పార్టీలో వారు చేరారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారికి జ‌న‌సేన కండువాలు క‌ప్పి.. సాద‌రంగా ఆహ్వానించారు. జ‌న‌సేన‌లో చేరిన వారిలో కృష్ణాజిల్లా వైసీపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన చిక్కాల దొర‌బాబు, ఇదే జిల్లాకు చెందిన దుగ్గ‌ల నాగ‌రాజు, అదేవిధంగా పురుషోత్తం.. ఉన్నారు.

ఇక‌, తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ సిటీ టికెట్‌ను ఆశిస్తున్న ఎదురువాక శ్రీ వెంకటగిరి కూడా జ‌న‌సేనకు జై కొట్టారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొగిరి సురేష్‌బాబు, క‌డ‌ప జిల్లాకు చెందిన వై. శ్రీనివాస‌రాజులు.. జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జ‌గ‌న్ పార్టీ పెట్టిన నాటి నుంచి తాము వైసీపీలో ఉన్నామ‌ని.. కానీ.. త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించామ‌ని.. క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌ని నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ బ‌ల‌హీనంగా ఉంద‌ని.. పైకి మాత్రం అధినేత అంటే.. గౌర‌వంతో కొంద‌రు పార్టీలో కొన‌సాగుతున్నార‌ని.. కానీ, ఎన్నిక‌ల నాటికి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని.. క‌డ‌ప జిల్లాకు చెందిన శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. కేవ‌లం.. రెడ్డి సామాజిక వ‌ర్గం కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టుగా ఉంద‌ని పొగిరి సురేష్‌బాబు వ్యాఖ్యానించారు. ఎవ‌రూ త‌మ ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు వైసీపీలో గౌర‌వం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. జ‌న‌సేన‌లో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు కూడా వాల్యూ ఉంద‌ని.. అంద‌రూ చెప్పేది తాను వింటాన‌ని చెప్పారు. పార్టీలో విభేదాలు రాకుండా.. అంద‌రూ క‌లిసిపోయి ప‌నిచేయాల‌ని సూచించారు.

This post was last modified on December 2, 2023 11:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

22 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

29 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

59 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago