Political News

‘వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంది!’

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీకి.. వైసీపీకి చెందిన నాయ‌కులు జై కొట్టారు. ప‌లు జిల్లాల‌కు చెందిన క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తాజాగా జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన పార్టీలో వారు చేరారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారికి జ‌న‌సేన కండువాలు క‌ప్పి.. సాద‌రంగా ఆహ్వానించారు. జ‌న‌సేన‌లో చేరిన వారిలో కృష్ణాజిల్లా వైసీపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన చిక్కాల దొర‌బాబు, ఇదే జిల్లాకు చెందిన దుగ్గ‌ల నాగ‌రాజు, అదేవిధంగా పురుషోత్తం.. ఉన్నారు.

ఇక‌, తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ సిటీ టికెట్‌ను ఆశిస్తున్న ఎదురువాక శ్రీ వెంకటగిరి కూడా జ‌న‌సేనకు జై కొట్టారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొగిరి సురేష్‌బాబు, క‌డ‌ప జిల్లాకు చెందిన వై. శ్రీనివాస‌రాజులు.. జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జ‌గ‌న్ పార్టీ పెట్టిన నాటి నుంచి తాము వైసీపీలో ఉన్నామ‌ని.. కానీ.. త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించామ‌ని.. క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌ని నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ బ‌ల‌హీనంగా ఉంద‌ని.. పైకి మాత్రం అధినేత అంటే.. గౌర‌వంతో కొంద‌రు పార్టీలో కొన‌సాగుతున్నార‌ని.. కానీ, ఎన్నిక‌ల నాటికి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని.. క‌డ‌ప జిల్లాకు చెందిన శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. కేవ‌లం.. రెడ్డి సామాజిక వ‌ర్గం కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టుగా ఉంద‌ని పొగిరి సురేష్‌బాబు వ్యాఖ్యానించారు. ఎవ‌రూ త‌మ ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు వైసీపీలో గౌర‌వం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. జ‌న‌సేన‌లో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు కూడా వాల్యూ ఉంద‌ని.. అంద‌రూ చెప్పేది తాను వింటాన‌ని చెప్పారు. పార్టీలో విభేదాలు రాకుండా.. అంద‌రూ క‌లిసిపోయి ప‌నిచేయాల‌ని సూచించారు.

This post was last modified on December 2, 2023 11:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

13 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

33 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

1 hour ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago