ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలేరుపై ఎన్నికల ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడమే. ఇక, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి బరిలో ఉన్నారు.
ఇక, మరోవైపు.. కమ్యూనిస్టు అగ్రనాయకుడు, తమ్మినేని వీరభద్రం కూడా ఈ దఫా పోటీకి దిగారు. ఈయన ఒంటరి పోరులో కుస్తీ పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రాజకీయంగా, అటు బెట్టింగుల పరంగా కూడా..పాలేరు మీడియాలో నిలిచింది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అనంతరం.. ఇక్కడ నుంచి పొంగులేటి విజయం తథ్యమని బెట్టింగ్ రాయుళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకుల అనుచరులే బెట్టింగులు కట్టారు.
పొంగులేటికి టికెట్ ఇవ్వడం ఇష్టంలేని కొందరు నాయకులు ఆయనకు సహకరించని విషయం ప్రస్తావనార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు పంచిన నియోజకవర్గాల్లో పాలేరు కీలకంగా మారింది. పోలింగ్కు ముందు.. నామినేషన్ వెలువడగానే కూడా.. ఖమ్మం నుంచి వందల కోట్ల సొమ్ము తరలిపోతుం డగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ.. ఇక్కడ కోట్ల మూటలు పరుగులు పెట్టాయనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా పొంగులేటికి మద్దతుగా బెట్టింగులు పెట్టిన వారంతా ఖుషీగా ఉన్నారని అంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా పొంగులేటికి మద్దతుగా మారాయి. దీనిలో ఏమీ తేడాలేకున్నా.. ప్రత్యర్థులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50 కోట్లకుపైగా పందాలు కట్టారని.. ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం.
This post was last modified on December 2, 2023 5:02 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…