ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలేరుపై ఎన్నికల ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడమే. ఇక, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి బరిలో ఉన్నారు.
ఇక, మరోవైపు.. కమ్యూనిస్టు అగ్రనాయకుడు, తమ్మినేని వీరభద్రం కూడా ఈ దఫా పోటీకి దిగారు. ఈయన ఒంటరి పోరులో కుస్తీ పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రాజకీయంగా, అటు బెట్టింగుల పరంగా కూడా..పాలేరు మీడియాలో నిలిచింది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అనంతరం.. ఇక్కడ నుంచి పొంగులేటి విజయం తథ్యమని బెట్టింగ్ రాయుళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకుల అనుచరులే బెట్టింగులు కట్టారు.
పొంగులేటికి టికెట్ ఇవ్వడం ఇష్టంలేని కొందరు నాయకులు ఆయనకు సహకరించని విషయం ప్రస్తావనార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు పంచిన నియోజకవర్గాల్లో పాలేరు కీలకంగా మారింది. పోలింగ్కు ముందు.. నామినేషన్ వెలువడగానే కూడా.. ఖమ్మం నుంచి వందల కోట్ల సొమ్ము తరలిపోతుం డగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ.. ఇక్కడ కోట్ల మూటలు పరుగులు పెట్టాయనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా పొంగులేటికి మద్దతుగా బెట్టింగులు పెట్టిన వారంతా ఖుషీగా ఉన్నారని అంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా పొంగులేటికి మద్దతుగా మారాయి. దీనిలో ఏమీ తేడాలేకున్నా.. ప్రత్యర్థులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50 కోట్లకుపైగా పందాలు కట్టారని.. ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం.
This post was last modified on December 2, 2023 5:02 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…