ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలేరుపై ఎన్నికల ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడమే. ఇక, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి బరిలో ఉన్నారు.
ఇక, మరోవైపు.. కమ్యూనిస్టు అగ్రనాయకుడు, తమ్మినేని వీరభద్రం కూడా ఈ దఫా పోటీకి దిగారు. ఈయన ఒంటరి పోరులో కుస్తీ పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రాజకీయంగా, అటు బెట్టింగుల పరంగా కూడా..పాలేరు మీడియాలో నిలిచింది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అనంతరం.. ఇక్కడ నుంచి పొంగులేటి విజయం తథ్యమని బెట్టింగ్ రాయుళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకుల అనుచరులే బెట్టింగులు కట్టారు.
పొంగులేటికి టికెట్ ఇవ్వడం ఇష్టంలేని కొందరు నాయకులు ఆయనకు సహకరించని విషయం ప్రస్తావనార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు పంచిన నియోజకవర్గాల్లో పాలేరు కీలకంగా మారింది. పోలింగ్కు ముందు.. నామినేషన్ వెలువడగానే కూడా.. ఖమ్మం నుంచి వందల కోట్ల సొమ్ము తరలిపోతుం డగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ.. ఇక్కడ కోట్ల మూటలు పరుగులు పెట్టాయనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా పొంగులేటికి మద్దతుగా బెట్టింగులు పెట్టిన వారంతా ఖుషీగా ఉన్నారని అంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా పొంగులేటికి మద్దతుగా మారాయి. దీనిలో ఏమీ తేడాలేకున్నా.. ప్రత్యర్థులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50 కోట్లకుపైగా పందాలు కట్టారని.. ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం.
This post was last modified on December 2, 2023 5:02 pm
మాములుగా ఈ స్టేట్ మెంట్ పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఫలానా నటుడు స్టార్ కావడానికి ఒక దర్శకుడు కారణమనే…
పెద్ది మార్చి నుంచి తప్పుకుని ఏప్రిల్ చివరికి వెళ్ళిపోయాక మూవీ లవర్స్ దృష్టి ప్యారడైజ్ వైపు వెళ్తోంది. వాయిదా కన్ఫర్మ్…
‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు అనుదీప్. అందులో అతను పండించిన కొత్త రకం కామెడీకి ఈ…
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…