ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలేరుపై ఎన్నికల ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడమే. ఇక, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి బరిలో ఉన్నారు.
ఇక, మరోవైపు.. కమ్యూనిస్టు అగ్రనాయకుడు, తమ్మినేని వీరభద్రం కూడా ఈ దఫా పోటీకి దిగారు. ఈయన ఒంటరి పోరులో కుస్తీ పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రాజకీయంగా, అటు బెట్టింగుల పరంగా కూడా..పాలేరు మీడియాలో నిలిచింది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అనంతరం.. ఇక్కడ నుంచి పొంగులేటి విజయం తథ్యమని బెట్టింగ్ రాయుళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకుల అనుచరులే బెట్టింగులు కట్టారు.
పొంగులేటికి టికెట్ ఇవ్వడం ఇష్టంలేని కొందరు నాయకులు ఆయనకు సహకరించని విషయం ప్రస్తావనార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు పంచిన నియోజకవర్గాల్లో పాలేరు కీలకంగా మారింది. పోలింగ్కు ముందు.. నామినేషన్ వెలువడగానే కూడా.. ఖమ్మం నుంచి వందల కోట్ల సొమ్ము తరలిపోతుం డగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ.. ఇక్కడ కోట్ల మూటలు పరుగులు పెట్టాయనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా పొంగులేటికి మద్దతుగా బెట్టింగులు పెట్టిన వారంతా ఖుషీగా ఉన్నారని అంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా పొంగులేటికి మద్దతుగా మారాయి. దీనిలో ఏమీ తేడాలేకున్నా.. ప్రత్యర్థులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50 కోట్లకుపైగా పందాలు కట్టారని.. ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…