ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడే కొద్దీ బెట్టింగుల హోరు, జోరు పెరిగిపోతోంది. నవంబర్ 30వ తేదీన జరిగిన పోలింగ్ కు డిసెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం నాడు కౌంటింగ్ జరగబోతోందని తెలిసిందే. పోలింగుకు ముందే మొదలైన బెట్టింగ్ రాయళ్ళ హడావుడి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలతో బాగా ఊపందుకున్నది. బెట్టింగంతా ముఖ్యంగా రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కేంద్రంగానే జరుగుతోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం బెట్టింగ్ మొత్తం సుమారు వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందట.
ఇందులో ప్రధానంగా పై రెండుపార్టీల్లో అధికారంలోకి వచ్చేది ఏది ? అన్న విషయమై బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే గజ్వేలు, కామారెడ్డిలో కేసీయార్ గెలుపోటములు, మెజారిటి, రేవంత్, ఈటల గెలుపోటములు, వాళ్ళకి వచ్చే ఓట్లపైన బెట్టింగులు పెరిగిపోతున్నాయి. అలాగే మరికొందరు ప్రముఖుల గెలుపోటములపైన కూడా బారీగా బెట్టింగులు జరుగుతున్నాయట. ప్రముఖుల బెట్టింగుల్లో ముఖ్యంగా కేటీయార్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి తదితరులపైన బెట్టింగులు జరుగుతున్నాయి.
ఈ బెట్టింగులు భీమవరంలోనే సుమారు రు. 300 కోట్లు దాటిపోయిందట. ఇక ఖమ్మంకు ఆనుకుని ఉండే విజయవాడలో కూడా భారీ ఎత్తునే జరుగుతున్నట్లు సమాచారం. ఎనిమిది సీట్లలో పోటీచేసిన జనసేన గెలవబోయే సీట్లపైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయట. అయితే ఇది చాలా తక్కువ మొత్తంలోనే జరుగుతున్నట్లు సమాచారం. జనసేనపైన జరుగుతున్న బెట్టింగులు ఏమిటంటే అభ్యర్ధుల్లో ఎంతమందికి డిపాజిట్లు వస్తాయనేది ముఖ్యం. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీచేసిన బర్రెలక్క (శిరీష)కు రాబోయే ఓట్లపైన కూడా కొందరు బెట్టింగులు కడుతున్నారట.
ఏదేమైనా ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే తెలంగాణా ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఎక్కువగా బెట్టింగులు జరుగుతుండటమే. నిజానికి తెలంగాణాలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏపీకి ఒరిగేదేమీ లేదు. అయినా భారీ ఎత్తున బెట్టింగులు జరిగిపోతున్నాయంటే ఇదో వ్యసనంలాగ మారిపోయిందని అర్ధమవుతోంది. లేకపోతే లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్లు ఎవరైనా బెట్టింగులు కడతారా ?
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…