Political News

వీళ్లు అయోధ్య‌-వాళ్లు తిరుమ‌ల‌.. ఎవ‌రిని ఏమ‌నాలి?

రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు.. అనే వారికి ఇవి మ‌చ్చుతున‌కలు. బీజేపీ నేత‌లు ప్రారంభించిన‌.. గుడియాత్ర‌ల వ్య‌వ‌హారం.. ఏపీ వర‌కు పాకిపోయింది. మ‌మ్మ‌ల్ని గెలిపించ‌డం.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నానికి అయ్యే ఖ‌ర్చు భ‌రించి.. ఉచితంగా రాముడి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని. కేంద్ర మంత్రి అమిత్‌షా.. మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. హిందువుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, అమిత్ షానే కాదు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా.. ఈ విష‌యాన్ని జోరుగా ప్ర‌చారం చేశారు. త‌న సొంత రాష్ట్రంలో అయోధ్య రాముడు జ‌న‌వ‌రిలో కొలుదీర‌నున్నాడ‌ని.. ఆయ‌న ద‌ర్శ‌నంకోసం.. మిమ్మ‌ల్ని ఫ్రీగా తీసుకువెళ్లి.. ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇస్తేనేన‌ని ఆయ‌న ష‌ర‌తు విధించారు. ఇలా.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నాల‌ను రాజ‌కీయం చేసిన క్రెడిట్ బీజేపీకే ద‌క్కింది.

ఇక‌, ఇప్పుడు ఏపీలోనూ ఇదే తంతు మొద‌లైంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిలు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌ల‌కు.. తిరుమ‌ల యాత్ర‌ను ఫ్రీగా చూపిస్తున్నారు. అది కూడా బ్రేక్ ద‌ర్శ‌నాలు కావ‌డం గ‌మ‌నార్హం. రాయ‌దుర్గం నుంచి వారానికి రెండు బ‌స్సులు పెట్టి.. ఇక్క‌డి త‌మ అనుకూల వ‌ర్గానికి వారు శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. రాను పోను, ఖ‌ర్చుల‌తోపాటు తిరుమ‌ల‌లో గెస్ట్ హౌస్‌ల ఖ‌ర్చును కూడా వారే భ‌రిస్తున్నారు.

అయితే.. బ్రేక్ ద‌ర్శ‌న టికెట్‌ను మాత్రం యాత్రికులే సెంటిమెంటుగా చెల్లిస్తున్నారు. ఇక‌, తిరుమ‌ల నుంచి క‌ళ్యాణ ల‌డ్డూలు విరివిగా తెప్పించి.. నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తి.. ఇంటింటికీ పంచుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ను గెలిపిస్తే.. కాశీ యాత్ర‌కు కూడా తీసుకువెళ్తామ‌ని హామీ ఇస్తున్నార‌ట‌. మొత్తానికి వాళ్లు అయోధ్య రాముడిని చూపిస్తామంటే.. వీరు తిరుమ‌ల శ్రీవారిని చూపిస్తున్నారు. ఎవ‌రిని ఏమ‌నాలి! అంతా రాజ‌కీయం.

This post was last modified on November 28, 2023 3:05 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

4 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

6 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

8 hours ago