Political News

వీళ్లు అయోధ్య‌-వాళ్లు తిరుమ‌ల‌.. ఎవ‌రిని ఏమ‌నాలి?

రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు.. అనే వారికి ఇవి మ‌చ్చుతున‌కలు. బీజేపీ నేత‌లు ప్రారంభించిన‌.. గుడియాత్ర‌ల వ్య‌వ‌హారం.. ఏపీ వర‌కు పాకిపోయింది. మ‌మ్మ‌ల్ని గెలిపించ‌డం.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నానికి అయ్యే ఖ‌ర్చు భ‌రించి.. ఉచితంగా రాముడి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని. కేంద్ర మంత్రి అమిత్‌షా.. మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. హిందువుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, అమిత్ షానే కాదు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా.. ఈ విష‌యాన్ని జోరుగా ప్ర‌చారం చేశారు. త‌న సొంత రాష్ట్రంలో అయోధ్య రాముడు జ‌న‌వ‌రిలో కొలుదీర‌నున్నాడ‌ని.. ఆయ‌న ద‌ర్శ‌నంకోసం.. మిమ్మ‌ల్ని ఫ్రీగా తీసుకువెళ్లి.. ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇస్తేనేన‌ని ఆయ‌న ష‌ర‌తు విధించారు. ఇలా.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నాల‌ను రాజ‌కీయం చేసిన క్రెడిట్ బీజేపీకే ద‌క్కింది.

ఇక‌, ఇప్పుడు ఏపీలోనూ ఇదే తంతు మొద‌లైంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిలు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌ల‌కు.. తిరుమ‌ల యాత్ర‌ను ఫ్రీగా చూపిస్తున్నారు. అది కూడా బ్రేక్ ద‌ర్శ‌నాలు కావ‌డం గ‌మ‌నార్హం. రాయ‌దుర్గం నుంచి వారానికి రెండు బ‌స్సులు పెట్టి.. ఇక్క‌డి త‌మ అనుకూల వ‌ర్గానికి వారు శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. రాను పోను, ఖ‌ర్చుల‌తోపాటు తిరుమ‌ల‌లో గెస్ట్ హౌస్‌ల ఖ‌ర్చును కూడా వారే భ‌రిస్తున్నారు.

అయితే.. బ్రేక్ ద‌ర్శ‌న టికెట్‌ను మాత్రం యాత్రికులే సెంటిమెంటుగా చెల్లిస్తున్నారు. ఇక‌, తిరుమ‌ల నుంచి క‌ళ్యాణ ల‌డ్డూలు విరివిగా తెప్పించి.. నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తి.. ఇంటింటికీ పంచుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ను గెలిపిస్తే.. కాశీ యాత్ర‌కు కూడా తీసుకువెళ్తామ‌ని హామీ ఇస్తున్నార‌ట‌. మొత్తానికి వాళ్లు అయోధ్య రాముడిని చూపిస్తామంటే.. వీరు తిరుమ‌ల శ్రీవారిని చూపిస్తున్నారు. ఎవ‌రిని ఏమ‌నాలి! అంతా రాజ‌కీయం.

This post was last modified on November 28, 2023 3:05 pm

Share

Recent Posts

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

12 minutes ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

43 minutes ago

ఆవారాపన్ 2… అంతగా ఏముందబ్బా

కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

అక్కినేని కుటుంబానికీ బెదిరింపులు తప్పలేదు

నేను కూడా సైబర్ బాదితుడినే… అందుకే వారానికోసారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మారుస్తుంటానని చెప్పారు హీరో నాగార్జున. కంప్యూటర్ విప్లవం…

1 hour ago

థియేటర్లకు భలే చిక్కు వచ్చి పడింది

టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా మారిపోయింది. జనవరి తర్వాత రెండు మూడు…

2 hours ago

ప్రభాస్‌తో డీపీ మార్పించారుగా…

ప్రభాస్ సోషల్ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఇక అందులోనూ చాలా అరుదుగా పర్సనల్ ప్రొఫైల్ మార్పులు కనిపిస్తుంటాయి. దాదాపు…

3 hours ago