Political News

35 వేల పోలింగ్ కేంద్రాలు.. 3 లక్ష‌ల మంది సిబ్బంది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నెల 30న 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎన్నిక‌ల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాదు.. నిరంతరం.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఎన్నిక‌ల అధికారులు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తున్నారు. ఎలక్షన్ ప్రిపరేషన్‌పై ఎన్నిక‌ల సంఘం నిశితంగా దృష్టి పెట్టింది.

ముఖ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. తెర‌మీద‌కు వ‌చ్చే మద్యం, నగదు పంపిణీని కట్టిడి చేసేందుకు ప్ర‌త్యేక యంత్రాంగాన్ని రెడీ చేసింది. ఈ క్ర‌మంలో చివరి రెండు రోజులు కీలకమని సీఈసీ స్ప‌ష్టం చేసింది. ఇక‌, మావోయిస్టు – సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి.

ఇక‌, మొత్తం 2290 మంది అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతుండ‌గా.. వీరి జాత‌కాలు తేల్చేందుకు రాష్ట్రంలో 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. మొత్తం 33 జిల్లాల్లోని 13 జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. పోలింగ్ టైం ముగియగానే సెగ్మెంట్లు ఖాళీ చేయాలని స్థానికేతరులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

119 అసెంబ్లీ కేంద్రాలు, 2,290 అభ్యర్థులు, సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో భారీ ఎత్తున సీఆర్ పీఎఫ్ ద‌ళాల‌ను కూడా రంగంలోకి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14వేలు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 30వ తేదీ పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించి.. తెలంగాణ సార‌థుల‌ను ఎన్నుకోనున్నారు.

This post was last modified on November 28, 2023 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago