నిజంగానే కొత్త విషయం. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాటల్ని ఇప్పటికే పలుమార్లు విన్నాం. కాస్త కష్టంగానే ఆయన తెలుగు మాట్లాడతారు. కానీ.. ఆయన తెలుగును బాగానే అర్థం చేసుకుంటారా? అంటే.. అవుననే మాట ఆయన నోటి నుంచే రావటం గమనార్హం. యూపీలోని ఝాన్సీలో కొత్తగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన టోనీ మనోజ్ కుమార్ తోనూ ప్రధాని మాట్లాడారు. తన పేరును చెప్పిన విద్యార్థిని.. మోడీ రెండుసార్లు అడిగారు. నిజానికి మోడీనే కాదు.. ఎవరున్నా.. ఆ విద్యార్థి పేరును రెండుమూడుసార్లు అడగాల్సిందే. ఎందుకంటే.. అంత ఆసక్తికరంగా ఉందా పేరు. ఇంతకీ ఆ విద్యార్థి పేరేమిటటే.. టోనీ మనోజ్ కుమార్. అతగాడు తన పేరు చెప్పిన వెంటనే మోడీ స్పందిస్తూ టోనీనా? మనోజ్ కుమారా? అని అడగ్గా.. తన పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్ గా చెప్పారు.
అలా అయితే మీరు టోనీగారు అన్న మాట అంటూ మోడీ సరదాగా పలికటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. శనివారం తెలుగు భాషా దినోత్సవం కావటంతో తాను తెలుగులో మాట్లాడతానని సదరు విద్యార్థి కోరగా.. తప్పకుండా మాట్లాడాలని.. తనకు బాగుంటుందని ప్రధాని చెప్పారు. దీంతో.. సదరు విద్యార్థి తెలుగులో మాట్లాడారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టోనీ మాట్లాడిన తెలుగు మాటలు తనకు అర్థమైనట్లుగా మోడీ చెప్పటం. అంతేకాదు.. టోనీ మనోజ్ చెప్పిన మాటలకు సరైన రీతిలో స్పందించటం చూసినప్పుడు తెలుగు మాటల్ని మోడీ అర్థం చేసుకుంటారన్న కొత్త విషయం బయటకు వచ్చిందని చెప్పాలి.
ఇంతకూ మనోజ్ ఏం మాట్లాడారంటే.. ‘‘మీ సంక్షేమ.. వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా.. ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు’’ అని చెప్పగా.. అందుకు మోడీ స్పందిస్తూ.. తాను ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని కానని.. మీ సహచరుడినే.. అంటూ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే.. ప్రధానికి తెలుగు బాగానే అర్థమవుతుందని చెప్పక తప్పదు. మోడీలోని ఇప్పటికి బయటకు రాని టాలెంట్లు ఇంకెన్ని ఉన్నాయో?
This post was last modified on August 30, 2020 5:14 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…