నిజంగానే కొత్త విషయం. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాటల్ని ఇప్పటికే పలుమార్లు విన్నాం. కాస్త కష్టంగానే ఆయన తెలుగు మాట్లాడతారు. కానీ.. ఆయన తెలుగును బాగానే అర్థం చేసుకుంటారా? అంటే.. అవుననే మాట ఆయన నోటి నుంచే రావటం గమనార్హం. యూపీలోని ఝాన్సీలో కొత్తగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన టోనీ మనోజ్ కుమార్ తోనూ ప్రధాని మాట్లాడారు. తన పేరును చెప్పిన విద్యార్థిని.. మోడీ రెండుసార్లు అడిగారు. నిజానికి మోడీనే కాదు.. ఎవరున్నా.. ఆ విద్యార్థి పేరును రెండుమూడుసార్లు అడగాల్సిందే. ఎందుకంటే.. అంత ఆసక్తికరంగా ఉందా పేరు. ఇంతకీ ఆ విద్యార్థి పేరేమిటటే.. టోనీ మనోజ్ కుమార్. అతగాడు తన పేరు చెప్పిన వెంటనే మోడీ స్పందిస్తూ టోనీనా? మనోజ్ కుమారా? అని అడగ్గా.. తన పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్ గా చెప్పారు.
అలా అయితే మీరు టోనీగారు అన్న మాట అంటూ మోడీ సరదాగా పలికటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. శనివారం తెలుగు భాషా దినోత్సవం కావటంతో తాను తెలుగులో మాట్లాడతానని సదరు విద్యార్థి కోరగా.. తప్పకుండా మాట్లాడాలని.. తనకు బాగుంటుందని ప్రధాని చెప్పారు. దీంతో.. సదరు విద్యార్థి తెలుగులో మాట్లాడారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టోనీ మాట్లాడిన తెలుగు మాటలు తనకు అర్థమైనట్లుగా మోడీ చెప్పటం. అంతేకాదు.. టోనీ మనోజ్ చెప్పిన మాటలకు సరైన రీతిలో స్పందించటం చూసినప్పుడు తెలుగు మాటల్ని మోడీ అర్థం చేసుకుంటారన్న కొత్త విషయం బయటకు వచ్చిందని చెప్పాలి.
ఇంతకూ మనోజ్ ఏం మాట్లాడారంటే.. ‘‘మీ సంక్షేమ.. వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా.. ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు’’ అని చెప్పగా.. అందుకు మోడీ స్పందిస్తూ.. తాను ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని కానని.. మీ సహచరుడినే.. అంటూ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే.. ప్రధానికి తెలుగు బాగానే అర్థమవుతుందని చెప్పక తప్పదు. మోడీలోని ఇప్పటికి బయటకు రాని టాలెంట్లు ఇంకెన్ని ఉన్నాయో?
This post was last modified on August 30, 2020 5:14 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…