నిజంగానే కొత్త విషయం. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాటల్ని ఇప్పటికే పలుమార్లు విన్నాం. కాస్త కష్టంగానే ఆయన తెలుగు మాట్లాడతారు. కానీ.. ఆయన తెలుగును బాగానే అర్థం చేసుకుంటారా? అంటే.. అవుననే మాట ఆయన నోటి నుంచే రావటం గమనార్హం. యూపీలోని ఝాన్సీలో కొత్తగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన టోనీ మనోజ్ కుమార్ తోనూ ప్రధాని మాట్లాడారు. తన పేరును చెప్పిన విద్యార్థిని.. మోడీ రెండుసార్లు అడిగారు. నిజానికి మోడీనే కాదు.. ఎవరున్నా.. ఆ విద్యార్థి పేరును రెండుమూడుసార్లు అడగాల్సిందే. ఎందుకంటే.. అంత ఆసక్తికరంగా ఉందా పేరు. ఇంతకీ ఆ విద్యార్థి పేరేమిటటే.. టోనీ మనోజ్ కుమార్. అతగాడు తన పేరు చెప్పిన వెంటనే మోడీ స్పందిస్తూ టోనీనా? మనోజ్ కుమారా? అని అడగ్గా.. తన పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్ గా చెప్పారు.
అలా అయితే మీరు టోనీగారు అన్న మాట అంటూ మోడీ సరదాగా పలికటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. శనివారం తెలుగు భాషా దినోత్సవం కావటంతో తాను తెలుగులో మాట్లాడతానని సదరు విద్యార్థి కోరగా.. తప్పకుండా మాట్లాడాలని.. తనకు బాగుంటుందని ప్రధాని చెప్పారు. దీంతో.. సదరు విద్యార్థి తెలుగులో మాట్లాడారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టోనీ మాట్లాడిన తెలుగు మాటలు తనకు అర్థమైనట్లుగా మోడీ చెప్పటం. అంతేకాదు.. టోనీ మనోజ్ చెప్పిన మాటలకు సరైన రీతిలో స్పందించటం చూసినప్పుడు తెలుగు మాటల్ని మోడీ అర్థం చేసుకుంటారన్న కొత్త విషయం బయటకు వచ్చిందని చెప్పాలి.
ఇంతకూ మనోజ్ ఏం మాట్లాడారంటే.. ‘‘మీ సంక్షేమ.. వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా.. ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు’’ అని చెప్పగా.. అందుకు మోడీ స్పందిస్తూ.. తాను ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని కానని.. మీ సహచరుడినే.. అంటూ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే.. ప్రధానికి తెలుగు బాగానే అర్థమవుతుందని చెప్పక తప్పదు. మోడీలోని ఇప్పటికి బయటకు రాని టాలెంట్లు ఇంకెన్ని ఉన్నాయో?
This post was last modified on August 30, 2020 5:14 pm
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…