నిజంగానే కొత్త విషయం. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాటల్ని ఇప్పటికే పలుమార్లు విన్నాం. కాస్త కష్టంగానే ఆయన తెలుగు మాట్లాడతారు. కానీ.. ఆయన తెలుగును బాగానే అర్థం చేసుకుంటారా? అంటే.. అవుననే మాట ఆయన నోటి నుంచే రావటం గమనార్హం. యూపీలోని ఝాన్సీలో కొత్తగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన టోనీ మనోజ్ కుమార్ తోనూ ప్రధాని మాట్లాడారు. తన పేరును చెప్పిన విద్యార్థిని.. మోడీ రెండుసార్లు అడిగారు. నిజానికి మోడీనే కాదు.. ఎవరున్నా.. ఆ విద్యార్థి పేరును రెండుమూడుసార్లు అడగాల్సిందే. ఎందుకంటే.. అంత ఆసక్తికరంగా ఉందా పేరు. ఇంతకీ ఆ విద్యార్థి పేరేమిటటే.. టోనీ మనోజ్ కుమార్. అతగాడు తన పేరు చెప్పిన వెంటనే మోడీ స్పందిస్తూ టోనీనా? మనోజ్ కుమారా? అని అడగ్గా.. తన పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్ గా చెప్పారు.
అలా అయితే మీరు టోనీగారు అన్న మాట అంటూ మోడీ సరదాగా పలికటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. శనివారం తెలుగు భాషా దినోత్సవం కావటంతో తాను తెలుగులో మాట్లాడతానని సదరు విద్యార్థి కోరగా.. తప్పకుండా మాట్లాడాలని.. తనకు బాగుంటుందని ప్రధాని చెప్పారు. దీంతో.. సదరు విద్యార్థి తెలుగులో మాట్లాడారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టోనీ మాట్లాడిన తెలుగు మాటలు తనకు అర్థమైనట్లుగా మోడీ చెప్పటం. అంతేకాదు.. టోనీ మనోజ్ చెప్పిన మాటలకు సరైన రీతిలో స్పందించటం చూసినప్పుడు తెలుగు మాటల్ని మోడీ అర్థం చేసుకుంటారన్న కొత్త విషయం బయటకు వచ్చిందని చెప్పాలి.
ఇంతకూ మనోజ్ ఏం మాట్లాడారంటే.. ‘‘మీ సంక్షేమ.. వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా.. ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు’’ అని చెప్పగా.. అందుకు మోడీ స్పందిస్తూ.. తాను ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని కానని.. మీ సహచరుడినే.. అంటూ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే.. ప్రధానికి తెలుగు బాగానే అర్థమవుతుందని చెప్పక తప్పదు. మోడీలోని ఇప్పటికి బయటకు రాని టాలెంట్లు ఇంకెన్ని ఉన్నాయో?
This post was last modified on August 30, 2020 5:14 pm
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…
విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…
సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…