Political News

‘నీ ఎన్నిక‌ల గుర్తు కంటే.. నువ్వే అందంగా ఉన్నావ్‌!’

మ‌హిళ‌ల‌పై భౌతిక దాడులేకాదు.. మాన‌సిక దాడులు కూడా కొన‌సాగుతున్నాయ‌నేందుకు.. ఇదే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఒక‌వైపు మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. దేశం ముందుకు సాగు తుంటే.. మ‌రోవైపు వారిని అవ‌మానించే క్ర‌తువులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి.. ప్ర‌జ‌ల మ‌ధ్య జై కొట్టించుకుని చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెట్టాల‌ని భావిస్తున్న‌వారి విష‌యంలోనే అవ‌మానాలు.. ఎదురవుతున్నాయి.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల కురుక్షేత్రంలోకి దిగిన మ‌హిళా అభ్య‌ర్థి విష‌యంలో అత్యంత జాగ్ర త్తగా వ్య‌వ‌హ‌రించాల్సిన రిట‌ర్నింగ్ అధికారి(ఆర్.వో) అత్యంత అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌స్తుతం తీవ్ర వివాదంగా మారింది. ఓ స్వ‌తంత్ర మ‌హిళా అభ్య‌ర్థిని ప‌ట్టుకుని.. ఆర్వో.. ‘నీ ఎన్నిక‌ల గుర్తుక‌న్నా.. నువ్వే అందంగా ఉన్నావ్‌.. నీ ఫొటో చూసి ఓటేస్తారులే వెళ్లు’ అని వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర వివాదం సృష్టించింది.

ఎక్క‌డ‌.. ఏం జ‌రిగింది?

ఈ నెల 30న పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈవీఎంలలో గుర్తుల కేటాయింపును పరిశీలించేందుకు కామారెడ్డి నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న మంగ‌లిప‌ల్లి భార్గ‌వి.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రానికి వెళ్లారు. అయితే.. ఈవీఎంలపై ముద్రించిన గుర్తులను చూసి అభ్యంతరం తెలిపారు. బీజేపీ, బీఎస్పీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల గుర్తులను మాత్రమే చాలా స్పష్టంగా ముద్రించారని, మిగతా అభ్యర్థుల గుర్తులు రంగు వెలిసిపోయి అస్పష్టంగా ఉన్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థి అయిన తనకు కేటాయించిన ‘బేబీ వాకర్‌’ గుర్తును సరిగా ముద్రించలేదని.. అది రెండు కర్రలను నిలబెట్టినట్లుగా ఉందని, అసలు ఏ కోణంలోనూ ‘బేబీ వాకర్‌’లా లేదని అభ్యంతరం తెలిపారు. ఈ విష‌యాన్నే ఆర్‌వో శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నించారు. గుర్తులు స్పష్టంగా లేకుంటే వృద్ధులు ఓటు ఎలా వేస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఆర్‌వో మాట్లాడుతూ.. ‘ఈవీఎంపై మీకు కేటాయించిన గుర్తు కంటే నీ ఫొటో బాగుంది.. అందంగా ఉన్నావ్‌. నీ గుర్తును చూసి ఓటు వేయరు..నీ ఫొటోను చూసి ఓట్లు వేస్తారు’ అని వ్యాఖ్యానించాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.

This post was last modified on November 25, 2023 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

33 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago