తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న(8 స్థానాలు) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వరుసగా రెండో రోజూ ఉమ్మడి పార్టీల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను బీఆర్ ఎస్ను , కాంగ్రెస్ను తిట్టలేనని చెప్పారు. బీఆర్ ఎస్ను తిట్టాలని, కాంగ్రెస్ నేత లను తిట్టాలని కొందరు కోరుతున్నారని తెలిపారు.
అయితే.. తనకు బీఆర్ ఎస్లోనూ.. కాంగ్రెస్లోనూ.. మిత్రులు ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తనకు మిత్రుడని, రేవంత్ రెడ్డితోనూ స్నేహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అయితే.. స్నేహం-రాజకీయం వేర్వేరే అయినా.. రాష్ట్ర మంతా తిరిగి పరిస్థితులు చూడలేదు కాబట్టి తాను బీఆర్ ఎస్ను తిట్టలేనని చెప్పారు. అయితే, తెలంగాణలోనూ ఏపీ మాదిరిగానే రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించా రు. గత పాలకులు చేసిన తప్పే పునరావృతం అవుతోందని అన్నారు.
కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనే భూముల ధరలు పెరుగుతున్నాయని.. ఇతర జిల్లాల మాటేంటని ఆయన ప్రశ్నించారు. పరీక్ష పేపర్స్ లీకుతోఎంతో మంది నిరుత్సాహానికి గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్(కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ) పాలన రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇలా డబుల్ ఇంజన్ సర్కారు వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తాను భావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు దక్కాలని.. వారిని చులకనగా చూడొద్దని పవన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on November 23, 2023 2:18 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…