తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న(8 స్థానాలు) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వరుసగా రెండో రోజూ ఉమ్మడి పార్టీల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను బీఆర్ ఎస్ను , కాంగ్రెస్ను తిట్టలేనని చెప్పారు. బీఆర్ ఎస్ను తిట్టాలని, కాంగ్రెస్ నేత లను తిట్టాలని కొందరు కోరుతున్నారని తెలిపారు.
అయితే.. తనకు బీఆర్ ఎస్లోనూ.. కాంగ్రెస్లోనూ.. మిత్రులు ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తనకు మిత్రుడని, రేవంత్ రెడ్డితోనూ స్నేహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అయితే.. స్నేహం-రాజకీయం వేర్వేరే అయినా.. రాష్ట్ర మంతా తిరిగి పరిస్థితులు చూడలేదు కాబట్టి తాను బీఆర్ ఎస్ను తిట్టలేనని చెప్పారు. అయితే, తెలంగాణలోనూ ఏపీ మాదిరిగానే రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించా రు. గత పాలకులు చేసిన తప్పే పునరావృతం అవుతోందని అన్నారు.
కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనే భూముల ధరలు పెరుగుతున్నాయని.. ఇతర జిల్లాల మాటేంటని ఆయన ప్రశ్నించారు. పరీక్ష పేపర్స్ లీకుతోఎంతో మంది నిరుత్సాహానికి గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్(కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ) పాలన రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇలా డబుల్ ఇంజన్ సర్కారు వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తాను భావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు దక్కాలని.. వారిని చులకనగా చూడొద్దని పవన్ వ్యాఖ్యానించారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…