తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్పై నిప్పులు చెరుగుతున్న బీజేపీతో చేతులు కలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారే ఆయన ఇంటికి వెళ్లారో.. ఈయనే మనసులో ఉన్నట్టు చేశారో.. మొత్తానికి కమలంతో గ్లాసు దోస్తీ కట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ.. మరో ఐదారు రోజుల వరకు ప్రచార సమయం ఉంది. దీంతో సహజంగానే మిత్ర పార్టీ నుంచి ప్రచారం కోసం పవన్పై ఒత్తిడి కొనసాగుతోంది. వచ్చే నాలుగు రోజుల పాటైనా ఆయన ప్రచారం చేయాలి.
అయితే.. ఇక్కడ ప్రధాన సంకటం.. ఎన్నికలు అనగానే ప్రత్యర్థులపై విరుచుకుపడాలి. పైగా హై ప్రొపైల్ నాయకుడు కాబట్టి పవన్ నేరుగా అధికార పార్టీపై శరాలు సంధించాలి. కానీ, ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. బీజేపీతో చేతులు కలిపినా.. బీఆర్ ఎస్పై పన్నెత్తు మాట అనే పరిస్థితి సహజంగానే టాలీవుడ్ వారికి లేకుండా పోయింది. అందుకే టాలీవుడ్ మౌనం పాటిస్తోంది. కానీ, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి తప్పని సరి పరిస్థితిలో వచ్చిన పవన్కు సబ్జెక్ట్ లేకుండా పోతోంది. ఆయన విమర్శించాలంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరునే విమర్శించాలి.
అలా విమర్శించే ధైర్యం, సాహసం.. మాట ఎలా ఉన్నా.. నోరు పెగిలే పరిస్థితి లేదు. ఒకవేళ ఏమైనా విమర్శలు ఎక్కుపెట్టినా.. బీఆర్ ఎస్ నుంచి షార్ప్ రియాక్షన్ ఖాయం. ఇది ఇండస్ట్రీకి చుట్టుకున్నా ఆశ్చర్యం లేదనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్.. పరిస్థితి అడకత్తర మాదిరిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. ఏపీని ముడిపెట్టి.. తెలంగాణ పోరాటాలను ప్రస్తావిస్తూ.. ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. అయితే, ఇవన్నీ ముగిసిన ముచ్చట్లుగానే ఉన్నాయి. వినీ వినీ తెలంగాణసమాజానికి బోరు కొట్టిందనే వాదన కూడా ఉంది.
అయితే.. ఇంతకు మించి పవన్కు మరో సబ్జెక్టు లేకుండా పోయింది. బీజేపీ ఒత్తిడితో బయటకు వచ్చినా.. ఎవరినీ టార్గెట్ చేయలేక.. ప్రస్తుత సమస్యలు ప్రస్తావించలేక.. ప్రజానీకం నాడి పట్టుకోలేక.. పవన్ తీవ్రస్థాయిలో సతమతమవుతున్నారనే లెక్కలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితిని తట్టుకుని బీజేపీ కోరుకున్న విధంగా ఆయన తెలంగాణ సమాజాన్ని ఎలా ఆకర్షిస్తారో చూడాలి.
This post was last modified on November 22, 2023 8:40 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…