Political News

రోజుకు అరకోటి లేచిపోతోందా? ఖర్చులతో అభ్యర్థులు బెంబేలు

ఎన్నికల పండుగ చివరి దశకు వచ్చేసింది. మహా అయితే.. సరిగ్గా వారం రోజులు. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే ఎనిమిది రోజులు. 28సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియటం.. 29న ఒక్క రోజు ఆగితే 30న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు డిసెంబరు 3న విడుదల కానున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ చివరి ఎనిమిది రోజుల ప్రచారం మరో ఎత్తు అని.. పోలింగ్ ముందు రోజు లెక్కనే వేరు ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని.. ప్రచార ఖర్చును చూసుకుంటున్న అభ్యర్థులకు దిమ్మ తిరిగిపోతుందని చెబుతున్నారు. ఒక మోస్తరు నియోజకవర్గాల్లోనే రోజుకు రూ.50లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరూ తగ్గేదేలే అన్న రీతిలో ఖర్చులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి చేయాల్సిన ఖర్చులు అంతకంతకూ పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు.

రూ.అరకోటి పూర్తి కానిదే రోజు పూర్తి కాని పరిస్థితి ఉందంటున్నారు. ఈ లెక్కకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గంలోని ఒక్కో బూత్ పరిధి ప్రచారానికి రోజుకు రూ.5వేల చొప్పున రెండు పార్టీలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రచారానికి వచ్చే వారికి సంబంధించి కూడా లెక్కలు భారీగా ఉన్నాయి. కాలి నడకన ప్రచారానికి వస్తే రోజుకు రూ.500తో పాటు టిఫిన్.. భోజనంతో పాటు ఇంటికి వెళ్లే వేళలో క్వార్టర్ బాటిల్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పురుషులకు రూ.500 ఇస్తున్నారని.. మహిళలకు మాత్రం రూ.400 మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. అదే బైక్ ర్యాలీ అయితే మాత్రం నాలుగు గంటల సమయానికి రూ.300 నుంచి రూ.400 వరకు ఇచ్చి పెట్రోల్ కు డబ్బులు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఖర్చువిపరీతంగా పెరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ.50 లక్షల వరకు ఖర్చు వస్తుందని.. అదే గ్రేటర్ పరిధిలో అయితే రోజుకు రూ.కోటి వరకు వస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి మించి రానున్న పది రోజుల ఖర్చు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on November 20, 2023 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

26 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago