Political News

బీజేపీ డౌన్ ఫాల్ కు ఈటల కారణమా ?

బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి అలియాస్ రాములమ్మ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తెలంగాణాలో బీజేపీ డౌన్ ఫాల్ కు హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందరే కారణమన్నారు. బీజేపీలో ఈటల చేరిన తర్వాతే పార్టీకి దరిద్రం పట్టుకున్నదన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలుచేశారు. ఆమె చేసిన ఆరోపణలను గమనిస్తే అసలు ఈటలను బీజేపీలోకి చేర్చిందే కేసీయార్ అన్నట్లుగా ఉంది. ఎందుకంటే బీజేపీలో కేసీయార్ నాటిన విత్తనమే ఈటల అని రాములమ్మ ఆరోపించారు.

రాములమ్మ ఆరోపణను జాగ్రత్తగా గమనిస్తే ఈటలను కేసీయారే బీజేపీలోకి పంపినట్లుగా అర్ధమవుతుంది. బీజేపీలో కేసీయార్ నాటిన విత్తనం మొలకెత్తి మొక్కగా మారి పార్టీనే దెబ్బతీసిందని విజయశాంతి మండిపడ్డారు. ఆయన పార్టీలో చేరిన తర్వాతే నేతల మధ్య విభేదాలు వచ్చాయని, కొందరి మధ్య విభేదాలు పెరిగిపోయాయన్నారు. ఈటల ఢిల్లీకి వెళ్ళి పదేపదే ఫిర్యాదులు చేసిన కారణంగానే అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించినట్లు ఆరోపించారు.

కేసీయార్ కు అనుకూలంగా ఉండాలనే బండిని తప్పించటంలో ఈటల కీలకపాత్ర పోషించినట్లు ఆమె ఆరోపించారు. బండిని తొలగించిన తర్వాతే పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయిందన్నారు. పార్టీ గ్రాఫ్ పడిపోయిన కారణంగానే సీనియర్ నేతలు చాలామంది ఒక్కొక్కళ్ళుగా పార్టీని వదిలేసినట్లు చెప్పారు. కేసీయార్-బీజేపీ రహస్య ఒప్పందం ప్రకారమే బండిని అగ్రనేతలు అధ్యక్షుడిగా తప్పించారనే ప్రచారాన్ని జనాలు కూడా నమ్మినట్లు రాములమ్మ గుర్తుచేశారు. కేసీయార్ అవినీతిని బయటకు తీస్తామని, కేసులు పెట్టి దర్యాప్తు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కారణంగానే తనతో పాటు చాలామంది బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు.

కేసీయార్-బీజేపీ ఏకమైపోవటంతో తాము పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని డిసైడ్ అయినట్లు చెప్పారు. కేసీయార్ అవినీతితో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పాత్రను ఈడీ ఆధారాలతో సహా నిరూపించినా ఎందుకని యాక్షన్ తీసుకోలేదో జనాలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీయార్ అంతు తేలుస్తామని హామీ ఇచ్చిన కారణంగానే తాను హస్తంపార్టీలో చేరినట్లు చెప్పారు. మరి రాములమ్మ కోరిక కాంగ్రెస్ అయినా తీరుస్తుందేమో చూడాలి.

This post was last modified on November 19, 2023 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

45 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

54 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago