Political News

అల‌సి.. సొల‌సి.. సొమ్మ‌సిల్లిన క‌విత‌..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కులు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు తింటున్నారో తిన‌డంలేదో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం మంచి నాళ్ల‌తోనే గ‌డిపేస్తున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం త‌న‌య‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఇటిక్యాలలో నిర్వ‌హించిన‌ రోడ్‌షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంట‌నే స్థానిక వైద్యుడు ఒక‌రు చేరుకుని ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన‌ట్టు వైద్యుడు తెలిపారు. అనంత‌రం.. అక్క‌డే కొంత సేపు క‌విత విశ్రాంతి తీసుకున్నారు.

ఆరోగ్యంగానే ఉన్నా..

కాగా, త‌న ప‌రిస్థితిపై క‌విత ఎక్స్ వేదిక‌గా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే స‌మ‌యంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కింద‌ట మంత్రి మ‌ల్లారెడ్డి కూడా క‌ళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు.

వెంట‌నే మ‌ల్లారెడ్డికి ఆయ‌న అనుచ‌రులు సోడా, కొబ్బ‌రి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత‌.. ఆయ‌న తేరుకున్నారు. మ‌రికొంద‌రు నాయ‌కులు త‌మ వెంట ప్రాథ‌మిక ఔష‌ధాల‌ను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్‌, బీపీ, షుగ‌ర్‌, గాయాల‌కు మందుల‌ను తెచ్చుకుంటున్నారు.

This post was last modified on November 18, 2023 2:27 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

35 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

37 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago