తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నాయకులు తలమునకలవుతున్నారు. ఈ క్రమంలో అసలు తింటున్నారో తినడంలేదో కూడా పట్టించుకోవడం లేదు. కేవలం మంచి నాళ్లతోనే గడిపేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.
జగిత్యాల నియోజకవర్గంలోని ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంటనే స్థానిక వైద్యుడు ఒకరు చేరుకుని ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వైద్యుడు తెలిపారు. అనంతరం.. అక్కడే కొంత సేపు కవిత విశ్రాంతి తీసుకున్నారు.
ఆరోగ్యంగానే ఉన్నా..
కాగా, తన పరిస్థితిపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే సమయంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట మంత్రి మల్లారెడ్డి కూడా కళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్రచారంలో చెప్పుకొచ్చారు.
వెంటనే మల్లారెడ్డికి ఆయన అనుచరులు సోడా, కొబ్బరి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేపటి తర్వాత.. ఆయన తేరుకున్నారు. మరికొందరు నాయకులు తమ వెంట ప్రాథమిక ఔషధాలను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్, బీపీ, షుగర్, గాయాలకు మందులను తెచ్చుకుంటున్నారు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…