తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నాయకులు తలమునకలవుతున్నారు. ఈ క్రమంలో అసలు తింటున్నారో తినడంలేదో కూడా పట్టించుకోవడం లేదు. కేవలం మంచి నాళ్లతోనే గడిపేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.
జగిత్యాల నియోజకవర్గంలోని ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంటనే స్థానిక వైద్యుడు ఒకరు చేరుకుని ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వైద్యుడు తెలిపారు. అనంతరం.. అక్కడే కొంత సేపు కవిత విశ్రాంతి తీసుకున్నారు.
ఆరోగ్యంగానే ఉన్నా..
కాగా, తన పరిస్థితిపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే సమయంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట మంత్రి మల్లారెడ్డి కూడా కళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్రచారంలో చెప్పుకొచ్చారు.
వెంటనే మల్లారెడ్డికి ఆయన అనుచరులు సోడా, కొబ్బరి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేపటి తర్వాత.. ఆయన తేరుకున్నారు. మరికొందరు నాయకులు తమ వెంట ప్రాథమిక ఔషధాలను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్, బీపీ, షుగర్, గాయాలకు మందులను తెచ్చుకుంటున్నారు.
This post was last modified on November 18, 2023 2:27 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…