Political News

అల‌సి.. సొల‌సి.. సొమ్మ‌సిల్లిన క‌విత‌..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కులు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు తింటున్నారో తిన‌డంలేదో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం మంచి నాళ్ల‌తోనే గ‌డిపేస్తున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం త‌న‌య‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఇటిక్యాలలో నిర్వ‌హించిన‌ రోడ్‌షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంట‌నే స్థానిక వైద్యుడు ఒక‌రు చేరుకుని ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన‌ట్టు వైద్యుడు తెలిపారు. అనంత‌రం.. అక్క‌డే కొంత సేపు క‌విత విశ్రాంతి తీసుకున్నారు.

ఆరోగ్యంగానే ఉన్నా..

కాగా, త‌న ప‌రిస్థితిపై క‌విత ఎక్స్ వేదిక‌గా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే స‌మ‌యంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కింద‌ట మంత్రి మ‌ల్లారెడ్డి కూడా క‌ళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు.

వెంట‌నే మ‌ల్లారెడ్డికి ఆయ‌న అనుచ‌రులు సోడా, కొబ్బ‌రి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత‌.. ఆయ‌న తేరుకున్నారు. మ‌రికొంద‌రు నాయ‌కులు త‌మ వెంట ప్రాథ‌మిక ఔష‌ధాల‌ను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్‌, బీపీ, షుగ‌ర్‌, గాయాల‌కు మందుల‌ను తెచ్చుకుంటున్నారు.

This post was last modified on November 18, 2023 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

18 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago