Political News

అల‌సి.. సొల‌సి.. సొమ్మ‌సిల్లిన క‌విత‌..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కులు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు తింటున్నారో తిన‌డంలేదో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం మంచి నాళ్ల‌తోనే గ‌డిపేస్తున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం త‌న‌య‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఇటిక్యాలలో నిర్వ‌హించిన‌ రోడ్‌షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంట‌నే స్థానిక వైద్యుడు ఒక‌రు చేరుకుని ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన‌ట్టు వైద్యుడు తెలిపారు. అనంత‌రం.. అక్క‌డే కొంత సేపు క‌విత విశ్రాంతి తీసుకున్నారు.

ఆరోగ్యంగానే ఉన్నా..

కాగా, త‌న ప‌రిస్థితిపై క‌విత ఎక్స్ వేదిక‌గా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే స‌మ‌యంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కింద‌ట మంత్రి మ‌ల్లారెడ్డి కూడా క‌ళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు.

వెంట‌నే మ‌ల్లారెడ్డికి ఆయ‌న అనుచ‌రులు సోడా, కొబ్బ‌రి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత‌.. ఆయ‌న తేరుకున్నారు. మ‌రికొంద‌రు నాయ‌కులు త‌మ వెంట ప్రాథ‌మిక ఔష‌ధాల‌ను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్‌, బీపీ, షుగ‌ర్‌, గాయాల‌కు మందుల‌ను తెచ్చుకుంటున్నారు.

This post was last modified on November 18, 2023 2:27 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

2 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

11 hours ago