తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నాయకులు తలమునకలవుతున్నారు. ఈ క్రమంలో అసలు తింటున్నారో తినడంలేదో కూడా పట్టించుకోవడం లేదు. కేవలం మంచి నాళ్లతోనే గడిపేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.
జగిత్యాల నియోజకవర్గంలోని ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంటనే స్థానిక వైద్యుడు ఒకరు చేరుకుని ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వైద్యుడు తెలిపారు. అనంతరం.. అక్కడే కొంత సేపు కవిత విశ్రాంతి తీసుకున్నారు.
ఆరోగ్యంగానే ఉన్నా..
కాగా, తన పరిస్థితిపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే సమయంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట మంత్రి మల్లారెడ్డి కూడా కళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్రచారంలో చెప్పుకొచ్చారు.
వెంటనే మల్లారెడ్డికి ఆయన అనుచరులు సోడా, కొబ్బరి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేపటి తర్వాత.. ఆయన తేరుకున్నారు. మరికొందరు నాయకులు తమ వెంట ప్రాథమిక ఔషధాలను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్, బీపీ, షుగర్, గాయాలకు మందులను తెచ్చుకుంటున్నారు.
This post was last modified on November 18, 2023 2:27 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…