Political News

టీడీపీ-జ‌న‌సేన పొత్తు.. స‌మ‌న్వ‌య‌మే అస‌లు స‌మ‌స్య‌!

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌ధాన ప‌క్షాలైన టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇరు పార్టీల అధినేత‌లు కూడా త‌ర‌చుగా భేటీ అవుతున్నారు. అయితే.. ఈ విషయంలో క్షేత్ర‌స్థాయి ప‌రిణామాలు మాత్రం ఇరు పార్టీల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పొత్తుల విష‌యంలో క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు వివ‌రించి.. స‌మ‌న్వ‌యం సాధించే దిశ‌గా వేస్తున్న అడుగులు కూడా ఒకింత త‌డ‌బ‌డుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌-టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే స‌మ‌న్వ‌య స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అయితే. కొన్ని ప్రాంతాల్లో ఇవి స‌క్సెస్ అవుతున్నా.. మ‌రికొన్ని చోట్ల మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నాయి. తాజాగా కాకినాడ‌లో నిర్వ‌హించి స‌మ‌న్వ‌య కార్య‌క్రమం ర‌సాభాస‌గా మారింది.

పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం వివాదంగా మారింది. కీల‌క‌మైన కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలోనూ నేత‌లు క‌లివిడి ప్ర‌ద‌ర్శించ‌లేక పోయారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్‌ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్‌ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తా­వించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్‌ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మీయ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన బాబు హాజరయ్యారు. అయితే.. ఇక్క‌డ సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అనే వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఇక్కడ కూడా తోపులాట‌లు చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూస్తేక్షేత్ర‌స్థాయిలో స‌మ‌న్వ‌యం సాధించ డం ఇప్పుడు క‌ష్టంగా మారిందనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 17, 2023 2:17 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

9 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

52 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago