Political News

14 నుంచి రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీస్తారట!

జనసేన మాస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి మొదలు రాష్ట్ర మంత్రుల వరకు రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించింది. నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన పాపాల చిట్టాను బయట పెడతామని.. కుంభకోణాల్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామంటూ హెచ్చరించిన వైనం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగు నుంచి మొదలు పెట్టనున్నట్లుగా పేర్కొంది.

ప్రజాకోర్టులో సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన.. తమ షెడ్యూల్ లో భాగంగా మొదట మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిని బయటపెడతామని పేర్కొన్నారు. ఇటీవల పాలవెల్లువ కార్యక్రమంలో రూ.2887 కోట్ల అవినీతి జరిగిందని తాము ఆరోపణలు చేశామని.. దాని మీద మంత్రి స్పందించటానికి పది రోజులు పట్టిందన్న జనసేన.. అప్పుడు కూడా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి వ్యక్తిగత దూషణలతో సరిపెట్టారే తప్పించి.. తాము చేసిన ఆరోపణల మీద మాత్రం మాట దాటేశారన్నారు.

తాము మూడు ప్రశ్నలు అడిగితే.. వాటికి సమాధానాలు ఇవ్వకపోవటాన్ని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నల్ని మరోసారి రిపీట్ చేసిన జనసేన వేసిన ప్రశ్నల్ని చూస్తే..

  • పశువుల కొనుగోలు విషయంలో ఇద్దరు మంత్రులు చెప్పిన సంఖ్యలో తేడా ఎందుకు వచ్చింది?
  • అసలు ఎవరు చెప్పింది నిజం?
  • మంత్రి చెప్పినట్లుగా 3.94 లక్షల పశువుల్ని కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు?
  • పశువుల కొనుగోలు విషయంలో అవినీతే జరగకుంటే లబ్థిదారుల వివరాల్ని ఎందుకు బయటపెట్టటం లేదు?
  • పాల వెల్లువ పథకంలో భాగంగా అమూల్ డెయిరీ నుంచి 2.72లక్షల లీటర్ల పాలను సేకరించి పంపుతున్నట్లుగా గొప్పలు చెప్పారు. నిజంగానే అన్ని పశువుల్ని కొని ఉంటే.. 22 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరగాలి. మరేమైంది?
    నవంబరు14న వైసీపీ సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా మంత్రి సీదిరి చేసిన మరో కుంభకోణం వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు. అంబులెన్సుల పేరుతో జరిగిన అవినీతిని బయటపెడతామని చెప్పిన జనసేన.. అనంతరం ముఖ్యమంత్రి నుంచి మంత్రుల చిట్టాను రోజుకు ఒకటి చొప్పున బయటపెట్టనున్నట్లుగా పేర్కొన్నారు. జనసేన ఇస్తున్న తాజా హెచ్చరికకు అధికార పక్షం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి

This post was last modified on November 12, 2023 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

10 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

10 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago