“ఏపీ వద్దంది. మేం తీసుకుంటున్నాం. తప్పేంటి?” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీ కంపెనీ తెలంగాణకు తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఏపీ వద్దంది. మేం కూడా వదిలేస్తే.. ఆయన(గల్లా జయదేవ్) బెంగళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం. ఇందులో తప్పేంటి? మేం బలవంతంగా లాక్కుంటే తప్పు” అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ కూడా అభివృద్ధి చెందాలనే తాము కోరుకుంటున్నామన్నారు. అయితే.. పెట్టుబడి దారులకు అక్కడ సమస్యలు తలెత్తున్నాయని.. అక్కడ ఉండలేని పరిస్థితి తలెత్తితే.. తొలి గమ్యస్థానం తెలంగాణేనని చెప్పారు. అమరరాజా కంపెనీ అధినేత జయదేవ్ కుటుంబం హైదరాబాద్లోనే ఉంటోందన్నారు. అందుకే వారు తెలంగాణకు వచ్చారని తెలిపారు.
“ఏపీలోనూ పెట్టుబడులు పెట్టాలనే మేం కోరుకుంటున్నాం. ఏపీపై మాకు ద్వేషం లేదు. టీడీపీపై అంతకన్నా లేదు. కానీ, చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్లో నిరసనలను అడ్డుకున్నాం. ఎందుకంటే.. వైసీపీ-టీడీపీలకు హైదరాబాద్ యుద్ధరంగం కాకూడదనే. ఏపీలో ఉండలేమని భావిస్తున్నవారికి తెలంగాణ ఫస్ట్ ఎట్రాక్షన్ గా మారింది. పరిశ్రమలకు కూడా అంతే” అని కేటీఆర్ అన్నారు. కాగా, గత ఏడాది అమరరాజా కంపెనీ తన రెండో విభాగాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
9500 కోట్ల రూపాయల దశలవారీ పెట్టుబడితో గిగా బ్యాటరీ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ విషయం అప్పట్లోనే సంచలనంగా మారి.. రాజకీయ దుమారానికి కూడా దారి తీసింది. అమరరాజా అధినేత గల్లా జయదేవ్.. టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా 2019లో విజయం దక్కించుకున్నారు. అయితే.. రాజకీయ కారణాలతోనే అమరరాజా హైదరాబాద్కు తరలిపోయిందనే విమర్శలు వచ్చాయి.
This post was last modified on November 12, 2023 10:12 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…