Political News

ఏపీ వ‌ద్దంది.. మేం తీసుకుంటున్నాం.. త‌ప్పేంటి: కేటీఆర్

“ఏపీ వ‌ద్దంది. మేం తీసుకుంటున్నాం. త‌ప్పేంటి?” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ నుంచి అమ‌రరాజా బ్యాట‌రీ కంపెనీ తెలంగాణ‌కు త‌ర‌లిపోయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. “ఏపీ వద్దంది. మేం కూడా వ‌దిలేస్తే.. ఆయ‌న‌(గ‌ల్లా జ‌య‌దేవ్‌) బెంగ‌ళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం. ఇందులో త‌ప్పేంటి? మేం బ‌ల‌వంతంగా లాక్కుంటే త‌ప్పు” అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ కూడా అభివృద్ధి చెందాల‌నే తాము కోరుకుంటున్నామ‌న్నారు. అయితే.. పెట్టుబ‌డి దారుల‌కు అక్కడ స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయ‌ని.. అక్క‌డ ఉండ‌లేని ప‌రిస్థితి త‌లెత్తితే.. తొలి గ‌మ్య‌స్థానం తెలంగాణేన‌ని చెప్పారు. అమ‌ర‌రాజా కంపెనీ అధినేత జ‌య‌దేవ్ కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉంటోంద‌న్నారు. అందుకే వారు తెలంగాణ‌కు వ‌చ్చార‌ని తెలిపారు.

“ఏపీలోనూ పెట్టుబ‌డులు పెట్టాల‌నే మేం కోరుకుంటున్నాం. ఏపీపై మాకు ద్వేషం లేదు. టీడీపీపై అంత‌క‌న్నా లేదు. కానీ, చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో నిర‌స‌న‌లను అడ్డుకున్నాం. ఎందుకంటే.. వైసీపీ-టీడీపీల‌కు హైద‌రాబాద్ యుద్ధ‌రంగం కాకూడ‌ద‌నే. ఏపీలో ఉండ‌లేమ‌ని భావిస్తున్న‌వారికి తెలంగాణ ఫ‌స్ట్ ఎట్రాక్ష‌న్ గా మారింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా అంతే” అని కేటీఆర్ అన్నారు. కాగా, గ‌త ఏడాది అమ‌ర‌రాజా కంపెనీ త‌న రెండో విభాగాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

9500 కోట్ల రూపాయ‌ల ద‌శ‌ల‌వారీ పెట్టుబ‌డితో గిగా బ్యాట‌రీ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ విష‌యం అప్ప‌ట్లోనే సంచ‌ల‌నంగా మారి.. రాజ‌కీయ దుమారానికి కూడా దారి తీసింది. అమ‌ర‌రాజా అధినేత గ‌ల్లా జ‌య‌దేవ్‌.. టీడీపీ త‌ర‌ఫున గుంటూరు ఎంపీగా 2019లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. రాజ‌కీయ కార‌ణాల‌తోనే అమ‌ర‌రాజా హైద‌రాబాద్‌కు త‌ర‌లిపోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

This post was last modified on November 12, 2023 10:12 am

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

1 hour ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

1 hour ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

5 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

6 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

6 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

7 hours ago