తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీఆర్ ఎస్ ఎంపీ పై కత్తితో దాడి జరిగిన ఘటన మరువ క ముందే.. తాజాగా మరో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడడం తో తొలుత జిల్లా ఆసుపత్రికి.. తర్వాత.. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వాహనం పూర్తిగా దెబ్బతిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ ఈ ఘటన అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత ఉద్రిక్తతలను సృష్టించింది.
ఏం జరిగంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరోసారి టికెట్ పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్నిముమ్మరం చేశారు. ఇలా.. శనివారం రాత్రి పొద్దు పోయే వరకు ఆయన ప్రచారంలోనే ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ తరఫున ఇక్కడ నుంచిపోటీ చేస్తున్న వంశీకృష్ణ.. గువ్వల తన ప్రచారంలో డబ్బులు పంచుతున్నారని.. ఆయన కారులో డబ్బులు ఉన్నాయని ఆరోపించారు.
దీంతో వంశీ కృష్ణ అనుచరులు కొందరు గువ్వల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో దారికాచి కారును నిలువరించారు. కారును తనిఖీ చేయాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్-బీఆర్ ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని తోపులాటకు దిగారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు మరింత దూకుడుగా.. రాళ్ల వర్షం కురిపించడంతో గువ్వల కారు ధ్వంసమైంది.
అంతేకాదు.. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గువ్వల కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి.. ప్రాధమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కాగా.. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ ఎస్-కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఇప్పుడు భౌతిక దాడులకు తెగబడడం.. మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on November 12, 2023 9:59 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…