తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని, డిసెంబర్ 3న ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి కూడా ఓడిస్తామని కేటీఆర్ అన్నారు.
గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టినట్టేనని, ఎవరైనా ఎగురుతామనుకుంటే వారి కర్మ అని అన్నారు. కామారెడ్డిలో బిల్డప్ కోసమే రేవంత్ పోటీ చేస్తున్నారని, అక్కడ తాను గెలవనని ఇండియా టుడే కాన్ క్లేవ్ లో స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కొడంగల్ లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక, గోషామహల్ లో రాజాసింగ్, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఓటమి కూడా తప్పదని జోస్యం చెప్పారు. ఈ మూడు విషయాలు రాసుకోవాలని మీడియా ప్రతినిధులతో కేటీఆర్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడీ కాదు ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని, గత ఎన్నికల్లో కూడా గోషామహల్ ఒక్కటే బీజేపీ గెలిచిందని కేటీఆర్ అన్నారు.
ఇక, ఏపీ రాజకీయాలపై కూడా కేటీఆర్ స్పందించారు. ప్రచార రథం మీద నుంచి పడిన ఘటన తర్వాత తనకు నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని, తనకు లోకేష్ తమ్ముడు వంటి వారని కేటీఆర్ అన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ తనకు అన్నయ్య వంటి వారని, ఎవరితోనూ తనకు వైరుధ్యం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబుపై కేసీఆర్ కు, తనకు ఎలాంటి కోపం లేదని, చంద్రబాబు ఆరోగ్యం గురించి తాను లోకేష్ ను వాకబు చేశానని చెప్పారు. చంద్రబాబుపై కక్ష సాధించే ఆలోచన కేసీఆర్ కు లేదని చెప్పారు. గతంలో చంద్రబాబు పిలిచిన వెంటనే అమరావతికి కేసీఆర్ వెళ్లారని గుర్తు చేశారు. రోజు తనను బూతులు తిట్టే రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఏమీ అనడం లేదని, అన్ని రాష్ట్రాలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…