లాంగ్ లాంగ్ ఎగో.. అంటూ… తన కుమారుడి విజయం కోసం.. గతాన్ని తవ్వేస్తున్నారు మాజీ మంత్రి, కాం గ్రెస్ నాయకుడు కుందూరు జానా రెడ్డి. మీ కోసం నేనప్పుడు అది చేశా.. నా కోసం మీరిప్పుడు మా అబ్బాయి ని గెలిపించండి! అంటూ.. నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. సాగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థిగా నోముల నరసింహయ్య కుమారుడు భగత్ ఉన్నారు.
ఇరువురు యువకులే కావడం.. ప్రధాన పార్టీల అభ్యర్థులు కావడం.. పోటీ తీవ్రంగా ఉండడంతో ఇరు పక్షాల్లో నూ పోటీ రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి తగిన విధంగా వారు ప్రచారంలో జోరుగా సాగుతు న్నారు. ప్రత్యర్తి లోపాలను ఎత్తిచూపుకొంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాక మరింత పెరిగింది. ప్రచారానికి దాదాపు 20 రోజుల సమయం ఉండడంతో ఎవరికి వారు దీటుగా ప్రచారన్ని ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో జైవీర్ తరఫున జానా రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో తన పలుకుబ డిని ఉపయోగించి.. బీఆర్ ఎస్ నుంచి నాయకులను లాగేసుకుంటున్నారు. ఇక, ఇదే సమయంలో గతాన్ని తవ్వుతున్నారు. తాను అనేక పర్యాయాలు ఇక్కడ నుంచి గెలిచి.. అనేక పనులు చేశానని చెబుతున్నారు. ఇక్కడ అభివృద్ధి చేసిన ఘతన తనదేనని అంటున్నారు. అయితే.. ఇంకా అభివృద్ధి మిగిలి ఉందని.. దానిని తన కుమారుడు జైవీర్ రెడ్డి చేస్తారని జానా రెడ్డి చెబుతున్నారు.
మొత్తంగా.. కుమారుడి కోసం.. అహర్నిశలూ.. జానా కష్టపడుతున్నారనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ నుంచి గెలిచిన జానా.. 2018లో నోముల నర్సింహయ్య(కమ్యూనిస్టుగా ఉంటూ.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు) చేతిలో ఓడిపోయారు. తర్వాత.. నోముల మరణంతో వచ్చిన బై పోల్లోనూ జానా పోటీ చేశారు. అయితే, అప్పుడు కూడా ఆయన ఓటమి చెందారు. ఇక, ఇప్పుడు తన వారసుడి విజయం కోసం తపిస్తున్నారు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…