లాంగ్ లాంగ్ ఎగో.. అంటూ… తన కుమారుడి విజయం కోసం.. గతాన్ని తవ్వేస్తున్నారు మాజీ మంత్రి, కాం గ్రెస్ నాయకుడు కుందూరు జానా రెడ్డి. మీ కోసం నేనప్పుడు అది చేశా.. నా కోసం మీరిప్పుడు మా అబ్బాయి ని గెలిపించండి! అంటూ.. నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. సాగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థిగా నోముల నరసింహయ్య కుమారుడు భగత్ ఉన్నారు.
ఇరువురు యువకులే కావడం.. ప్రధాన పార్టీల అభ్యర్థులు కావడం.. పోటీ తీవ్రంగా ఉండడంతో ఇరు పక్షాల్లో నూ పోటీ రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి తగిన విధంగా వారు ప్రచారంలో జోరుగా సాగుతు న్నారు. ప్రత్యర్తి లోపాలను ఎత్తిచూపుకొంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాక మరింత పెరిగింది. ప్రచారానికి దాదాపు 20 రోజుల సమయం ఉండడంతో ఎవరికి వారు దీటుగా ప్రచారన్ని ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో జైవీర్ తరఫున జానా రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో తన పలుకుబ డిని ఉపయోగించి.. బీఆర్ ఎస్ నుంచి నాయకులను లాగేసుకుంటున్నారు. ఇక, ఇదే సమయంలో గతాన్ని తవ్వుతున్నారు. తాను అనేక పర్యాయాలు ఇక్కడ నుంచి గెలిచి.. అనేక పనులు చేశానని చెబుతున్నారు. ఇక్కడ అభివృద్ధి చేసిన ఘతన తనదేనని అంటున్నారు. అయితే.. ఇంకా అభివృద్ధి మిగిలి ఉందని.. దానిని తన కుమారుడు జైవీర్ రెడ్డి చేస్తారని జానా రెడ్డి చెబుతున్నారు.
మొత్తంగా.. కుమారుడి కోసం.. అహర్నిశలూ.. జానా కష్టపడుతున్నారనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ నుంచి గెలిచిన జానా.. 2018లో నోముల నర్సింహయ్య(కమ్యూనిస్టుగా ఉంటూ.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు) చేతిలో ఓడిపోయారు. తర్వాత.. నోముల మరణంతో వచ్చిన బై పోల్లోనూ జానా పోటీ చేశారు. అయితే, అప్పుడు కూడా ఆయన ఓటమి చెందారు. ఇక, ఇప్పుడు తన వారసుడి విజయం కోసం తపిస్తున్నారు. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
This post was last modified on November 9, 2023 7:11 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…