Political News

విచారణలో జాప్యం..జగన్ కు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హరిరామజోగయ్య వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. 2024 ఎన్నికల లోపు ఈ కేసులపై తీర్పునివ్వాలని వేసిన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీంతో, ఈ విషయంపై కోర్టులో సుదీర్ఘ వాదలు జరిగాయి. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత దానిని పిల్ గా మార్చేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీఎం జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇక, ఇదే విషయంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ తోపాటు సీబీఐకి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ పక్క సుప్రీం కోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వరుస నోటీసులివ్వడంతో జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.

This post was last modified on November 8, 2023 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

3 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

6 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

6 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

7 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

8 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

8 hours ago