Political News

విచారణలో జాప్యం..జగన్ కు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హరిరామజోగయ్య వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. 2024 ఎన్నికల లోపు ఈ కేసులపై తీర్పునివ్వాలని వేసిన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీంతో, ఈ విషయంపై కోర్టులో సుదీర్ఘ వాదలు జరిగాయి. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత దానిని పిల్ గా మార్చేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీఎం జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇక, ఇదే విషయంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ తోపాటు సీబీఐకి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ పక్క సుప్రీం కోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వరుస నోటీసులివ్వడంతో జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.

This post was last modified on November 8, 2023 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

58 minutes ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

6 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

7 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago