ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హరిరామజోగయ్య వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. 2024 ఎన్నికల లోపు ఈ కేసులపై తీర్పునివ్వాలని వేసిన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీంతో, ఈ విషయంపై కోర్టులో సుదీర్ఘ వాదలు జరిగాయి. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత దానిని పిల్ గా మార్చేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీఎం జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక, ఇదే విషయంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ తోపాటు సీబీఐకి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ పక్క సుప్రీం కోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వరుస నోటీసులివ్వడంతో జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.
This post was last modified on November 8, 2023 10:36 pm
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…