Political News

విచారణలో జాప్యం..జగన్ కు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హరిరామజోగయ్య వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. 2024 ఎన్నికల లోపు ఈ కేసులపై తీర్పునివ్వాలని వేసిన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీంతో, ఈ విషయంపై కోర్టులో సుదీర్ఘ వాదలు జరిగాయి. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత దానిని పిల్ గా మార్చేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీఎం జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇక, ఇదే విషయంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ తోపాటు సీబీఐకి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ పక్క సుప్రీం కోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వరుస నోటీసులివ్వడంతో జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.

This post was last modified on November 8, 2023 10:36 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

37 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

54 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago