Political News

‘జ‌గ‌న్‌పై ఈగ వాలినా ఊరుకోం.. ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం’

ఏపీ సీఐడీ.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా మీడియాలో ఉంటున్న పోలీసు విభాగం. మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్టు ద‌రిమిలా.. ఏపీ సీఐడీ చ‌ర్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ సీఐడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం జ‌గ‌న్‌పై ఈగ‌వాలినా ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఎవ‌రైనా సాహ‌సించి ఆయ‌న‌పై పోస్టులు పెట్టినా.. వ్యాఖ్య‌లు చేసినా వారి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుని కేసులు పెడ‌తామ‌ని కూడా హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ సీఐడీ చీఫ్ సంజ‌య్‌.. సీఎం జగన్ స‌హా ఆయ‌న కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాదు, సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని, ఎవ‌రైనా అస‌భ్య పోస్టులు పెడితే.. వారిని గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని చెప్పారు.

ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా కూడా చర్యలు తీసుకోనున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.

202 సోషల్ మీడియా అకౌంట్స్‌ను మానిటరింగ్‌ చేస్తున్నామని సీఐడీ చీఫ్ చెప్పుకొచ్చారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్‌ గుర్తించామన్నారు. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2,972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు సంజయ్‌ వెల్లడించారు.

చ‌ట్టం ఏం చెబుతోంది?

స‌రే.. సంజ‌య్ చెప్పుకొచ్చారు బాగానే ఉంది. కానీ, ఐటీ చ‌ట్టం ప్ర‌కారం ఇవి చెల్లుబాటు అవుతాయా? అనేది ప్ర‌శ్న‌. గ‌తంలో ప్ర‌ధాన మంత్రికి వ్య‌తిరేకంగా వ‌చ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన ఇద్ద‌రు విద్యార్థినుల‌ను క‌ర్ణాట‌క పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో నిందితులు పిటిష‌న్ వేయ‌గా.. విచారించిన సుప్రీం కోర్టు.. ఐటీ చ‌ట్టంలోని కొన్ని సెక్ష‌న్ల‌ను తొల‌గించాల‌ని.. భావ‌ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని తేల్చి చెప్పింది. ట్రోల్స్‌, మీమ్స్ వంటివి భావ ప్ర‌క‌ట‌న‌లోకే వ‌స్తాయ‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ప్ర‌జాజీవితంలో ఉన్న‌వారు అన్నింటికీ సిద్ధ‌మ‌య్యే ఉండాల‌ని తేల్చి చెప్పింది. మ‌రి ఇప్పుడు సీఐడీ వాద‌న ఎంత వ‌ర‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో నిల‌బ‌డుతుందో చూడాలి.

This post was last modified on November 8, 2023 8:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

1 hour ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

7 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

7 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago