Political News

ఎవరైనా వస్తారేమోనని బీజేపీ ఎదురు చూపులు

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసేందుకు ఇంకో రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నెల పదే చివరి తేదీ. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరోవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తి జాబితా ప్రకటించలేదు. బీజేపీది కూడా కాంగ్రెస్ లాంటి పరిస్థితే. బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరైనా కీలక నేతలు పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ వరుసగా 52, 1, 35, 12 మంది అభ్యర్థులతో నాలుగు జాబితాలను ఇప్పటివరకూ విడుదల చేసింది. దీంతో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100 కు చేరింది. మరోవైపు పొత్తు కారణంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. ఇక మిగిలింది 11 స్థానాలు. మల్కాజిగిరి, పెద్దపల్లి, శేరిలింగపల్లి, మేడ్చల్, నాంపల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అలంపూర్, మధిర, నర్సంపేట, సంగారెడ్డి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినా బీ ఫాం దక్కించుకోలేకపోయిన అబ్రహం తమ పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తోంది. మధిర, నర్సంపేట తదితర స్థానాల్లోనూ ఇతర పార్టీ నాయకులు వస్తే టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు టాక్. మరోవైపు మల్కాజిగిరిలో రామచందర్ రావు, ఆకుల రాజేందర్ మధ్య, శేరిలింగపల్లిలో గజ్జల యోగానంద్, రవికుమార్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మరి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి వీలైనంత త్వరగా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

This post was last modified on November 8, 2023 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

57 minutes ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

6 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

6 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago