Political News

ఎవరైనా వస్తారేమోనని బీజేపీ ఎదురు చూపులు

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసేందుకు ఇంకో రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నెల పదే చివరి తేదీ. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరోవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తి జాబితా ప్రకటించలేదు. బీజేపీది కూడా కాంగ్రెస్ లాంటి పరిస్థితే. బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరైనా కీలక నేతలు పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ వరుసగా 52, 1, 35, 12 మంది అభ్యర్థులతో నాలుగు జాబితాలను ఇప్పటివరకూ విడుదల చేసింది. దీంతో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100 కు చేరింది. మరోవైపు పొత్తు కారణంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. ఇక మిగిలింది 11 స్థానాలు. మల్కాజిగిరి, పెద్దపల్లి, శేరిలింగపల్లి, మేడ్చల్, నాంపల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అలంపూర్, మధిర, నర్సంపేట, సంగారెడ్డి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినా బీ ఫాం దక్కించుకోలేకపోయిన అబ్రహం తమ పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తోంది. మధిర, నర్సంపేట తదితర స్థానాల్లోనూ ఇతర పార్టీ నాయకులు వస్తే టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు టాక్. మరోవైపు మల్కాజిగిరిలో రామచందర్ రావు, ఆకుల రాజేందర్ మధ్య, శేరిలింగపల్లిలో గజ్జల యోగానంద్, రవికుమార్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మరి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి వీలైనంత త్వరగా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

This post was last modified on November 8, 2023 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago