తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసేందుకు ఇంకో రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నెల పదే చివరి తేదీ. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరోవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తి జాబితా ప్రకటించలేదు. బీజేపీది కూడా కాంగ్రెస్ లాంటి పరిస్థితే. బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరైనా కీలక నేతలు పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ వరుసగా 52, 1, 35, 12 మంది అభ్యర్థులతో నాలుగు జాబితాలను ఇప్పటివరకూ విడుదల చేసింది. దీంతో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100 కు చేరింది. మరోవైపు పొత్తు కారణంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. ఇక మిగిలింది 11 స్థానాలు. మల్కాజిగిరి, పెద్దపల్లి, శేరిలింగపల్లి, మేడ్చల్, నాంపల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అలంపూర్, మధిర, నర్సంపేట, సంగారెడ్డి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినా బీ ఫాం దక్కించుకోలేకపోయిన అబ్రహం తమ పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తోంది. మధిర, నర్సంపేట తదితర స్థానాల్లోనూ ఇతర పార్టీ నాయకులు వస్తే టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు టాక్. మరోవైపు మల్కాజిగిరిలో రామచందర్ రావు, ఆకుల రాజేందర్ మధ్య, శేరిలింగపల్లిలో గజ్జల యోగానంద్, రవికుమార్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మరి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి వీలైనంత త్వరగా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
This post was last modified on November 8, 2023 10:33 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…