ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవరాయులుకు, పార్టీకి మధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది. రైతులు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన నేరుగా వారి శిబిరాలకు వెళ్లి పరామర్శించిన నాటి నుంచి సీఎం జగన్ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.
ఇక, పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తాలన్నా.. పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఉన్న ఎంపీ మిథున్రెడ్డి లావుకు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో సుమారు 12 ప్రశ్నలపై లావు తయారు చేసుకున్న నివేదికకు మిథున్రెడ్డి.. గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం తెలపలేదు. దీంతో లావు.. పార్లమెంటుకు కూడా సరిగా హాజరుకాలేక పోయారు. ఇక, స్థానికంగా కూడా వైసీపీ నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారు. వెరసి లావు పరిస్థితి సన్నగిల్లిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట టికెట్ను వేరే వారికి కేటాయించేందుకు వైసీపీలో అంతర్గత చర్చ సాగుతున్నట్టు కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతకు ఈ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లు, కాదు.. పారిశ్రామిక వేత్తకు కేటాయిస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చేందుకు ఎదురు చూస్తున్న బలమైన నాయకుడి వారసుడికి కేటాయించేందుకు అధిష్టానం రెడీ అయితే.. చర్చ సాగుతోంది.
వెరసి.. వైసీపీలో దూకుడుగా ఉన్న.. లావు శ్రీకృష్ణదేవరాయలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన కొందరు నాయకులు కూడా లావుపై ఫిర్యాదులు చేయడం.. ఆయనతో కలిసి పనిచేయలేమని చెప్పడం..(చెప్పారా? చెప్పించారా? అనేది సందేహం) వంటివి కూడా చర్చగానే ఉన్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల సమయంలో లావుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 18, 2023 11:02 am
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…