ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవరాయులుకు, పార్టీకి మధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది. రైతులు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన నేరుగా వారి శిబిరాలకు వెళ్లి పరామర్శించిన నాటి నుంచి సీఎం జగన్ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.
ఇక, పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తాలన్నా.. పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఉన్న ఎంపీ మిథున్రెడ్డి లావుకు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో సుమారు 12 ప్రశ్నలపై లావు తయారు చేసుకున్న నివేదికకు మిథున్రెడ్డి.. గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం తెలపలేదు. దీంతో లావు.. పార్లమెంటుకు కూడా సరిగా హాజరుకాలేక పోయారు. ఇక, స్థానికంగా కూడా వైసీపీ నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారు. వెరసి లావు పరిస్థితి సన్నగిల్లిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట టికెట్ను వేరే వారికి కేటాయించేందుకు వైసీపీలో అంతర్గత చర్చ సాగుతున్నట్టు కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతకు ఈ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లు, కాదు.. పారిశ్రామిక వేత్తకు కేటాయిస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చేందుకు ఎదురు చూస్తున్న బలమైన నాయకుడి వారసుడికి కేటాయించేందుకు అధిష్టానం రెడీ అయితే.. చర్చ సాగుతోంది.
వెరసి.. వైసీపీలో దూకుడుగా ఉన్న.. లావు శ్రీకృష్ణదేవరాయలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన కొందరు నాయకులు కూడా లావుపై ఫిర్యాదులు చేయడం.. ఆయనతో కలిసి పనిచేయలేమని చెప్పడం..(చెప్పారా? చెప్పించారా? అనేది సందేహం) వంటివి కూడా చర్చగానే ఉన్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల సమయంలో లావుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 18, 2023 11:02 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…