ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవరాయులుకు, పార్టీకి మధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది. రైతులు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన నేరుగా వారి శిబిరాలకు వెళ్లి పరామర్శించిన నాటి నుంచి సీఎం జగన్ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.
ఇక, పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తాలన్నా.. పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఉన్న ఎంపీ మిథున్రెడ్డి లావుకు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో సుమారు 12 ప్రశ్నలపై లావు తయారు చేసుకున్న నివేదికకు మిథున్రెడ్డి.. గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం తెలపలేదు. దీంతో లావు.. పార్లమెంటుకు కూడా సరిగా హాజరుకాలేక పోయారు. ఇక, స్థానికంగా కూడా వైసీపీ నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారు. వెరసి లావు పరిస్థితి సన్నగిల్లిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట టికెట్ను వేరే వారికి కేటాయించేందుకు వైసీపీలో అంతర్గత చర్చ సాగుతున్నట్టు కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతకు ఈ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లు, కాదు.. పారిశ్రామిక వేత్తకు కేటాయిస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చేందుకు ఎదురు చూస్తున్న బలమైన నాయకుడి వారసుడికి కేటాయించేందుకు అధిష్టానం రెడీ అయితే.. చర్చ సాగుతోంది.
వెరసి.. వైసీపీలో దూకుడుగా ఉన్న.. లావు శ్రీకృష్ణదేవరాయలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన కొందరు నాయకులు కూడా లావుపై ఫిర్యాదులు చేయడం.. ఆయనతో కలిసి పనిచేయలేమని చెప్పడం..(చెప్పారా? చెప్పించారా? అనేది సందేహం) వంటివి కూడా చర్చగానే ఉన్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల సమయంలో లావుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…