Political News

‘లావు’ త‌గ్గింది.. వైసీపీకి దూర‌మేనా..?

ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుకు, పార్టీకి మ‌ధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. రైతులు రాజ‌ధాని కోసం ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న నేరుగా వారి శిబిరాల‌కు వెళ్లి ప‌రామ‌ర్శించిన నాటి నుంచి సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు.

ఇక‌, పార్ల‌మెంటులో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాల‌న్నా.. పార్ల‌మెంట‌రీ ప‌క్ష నాయ‌కుడిగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి లావుకు ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో సుమారు 12 ప్ర‌శ్న‌ల‌పై లావు త‌యారు చేసుకున్న నివేదిక‌కు మిథున్‌రెడ్డి.. గ‌త వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఆమోదం తెల‌ప‌లేదు. దీంతో లావు.. పార్ల‌మెంటుకు కూడా స‌రిగా హాజ‌రుకాలేక పోయారు. ఇక‌, స్థానికంగా కూడా వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు. వెర‌సి లావు ప‌రిస్థితి స‌న్న‌గిల్లింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావుపేట టికెట్‌ను వేరే వారికి కేటాయించేందుకు వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతున్న‌ట్టు కొన్నాళ్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ నిర్మాత‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని కొన్నాళ్లు, కాదు.. పారిశ్రామిక వేత్త‌కు కేటాయిస్తార‌ని కొన్నాళ్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి వ‌చ్చేందుకు ఎదురు చూస్తున్న బ‌ల‌మైన నాయ‌కుడి వార‌సుడికి కేటాయించేందుకు అధిష్టానం రెడీ అయితే.. చ‌ర్చ సాగుతోంది.

వెర‌సి.. వైసీపీలో దూకుడుగా ఉన్న‌.. లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన కొంద‌రు నాయ‌కులు కూడా లావుపై ఫిర్యాదులు చేయ‌డం.. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌లేమ‌ని చెప్ప‌డం..(చెప్పారా? చెప్పించారా? అనేది సందేహం) వంటివి కూడా చ‌ర్చ‌గానే ఉన్నాయి. మొత్తానికి 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో లావుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా త‌గ్గిపోయింది. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 18, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

42 minutes ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

2 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

2 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

3 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago