Political News

‘లావు’ త‌గ్గింది.. వైసీపీకి దూర‌మేనా..?

ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుకు, పార్టీకి మ‌ధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. రైతులు రాజ‌ధాని కోసం ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న నేరుగా వారి శిబిరాల‌కు వెళ్లి ప‌రామ‌ర్శించిన నాటి నుంచి సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు.

ఇక‌, పార్ల‌మెంటులో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాల‌న్నా.. పార్ల‌మెంట‌రీ ప‌క్ష నాయ‌కుడిగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి లావుకు ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో సుమారు 12 ప్ర‌శ్న‌ల‌పై లావు త‌యారు చేసుకున్న నివేదిక‌కు మిథున్‌రెడ్డి.. గ‌త వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఆమోదం తెల‌ప‌లేదు. దీంతో లావు.. పార్ల‌మెంటుకు కూడా స‌రిగా హాజ‌రుకాలేక పోయారు. ఇక‌, స్థానికంగా కూడా వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు. వెర‌సి లావు ప‌రిస్థితి స‌న్న‌గిల్లింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌స‌రావుపేట టికెట్‌ను వేరే వారికి కేటాయించేందుకు వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతున్న‌ట్టు కొన్నాళ్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ నిర్మాత‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని కొన్నాళ్లు, కాదు.. పారిశ్రామిక వేత్త‌కు కేటాయిస్తార‌ని కొన్నాళ్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి వ‌చ్చేందుకు ఎదురు చూస్తున్న బ‌ల‌మైన నాయ‌కుడి వార‌సుడికి కేటాయించేందుకు అధిష్టానం రెడీ అయితే.. చ‌ర్చ సాగుతోంది.

వెర‌సి.. వైసీపీలో దూకుడుగా ఉన్న‌.. లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన కొంద‌రు నాయ‌కులు కూడా లావుపై ఫిర్యాదులు చేయ‌డం.. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌లేమ‌ని చెప్ప‌డం..(చెప్పారా? చెప్పించారా? అనేది సందేహం) వంటివి కూడా చ‌ర్చ‌గానే ఉన్నాయి. మొత్తానికి 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో లావుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా త‌గ్గిపోయింది. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

గీతాంజలి… ఇలాంటివి కదా చూడాలి

గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…

2 hours ago

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…

4 hours ago

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

4 hours ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

4 hours ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

5 hours ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

5 hours ago