Political News

అసమ్మతికి కాంగ్రెస్ తలొగ్గుతుందా?

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న గ్రాఫ్ ను, ఏర్పడుతున్న సానుకూల పవనాలను అనుకూలంగా మార్చుకుని విజయం సాధించాలని చూస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. పార్టీకి నష్టం కలిగే విషయాలపై ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది. ఈ సారి టికెట్ల కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన డిమాండ్ నెలకొంది. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఈ అసమ్మతిని తగ్గించేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అసంత్రుప్తి నేతలను బుజ్జగించేందుకు కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పజెప్పింది. అంతే కాకుండా పార్టీ నాయకులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ అనుకుంటున్నట్లు తెలిసింది. టికెట్లు దక్కించుకున్న నాయకులు ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవడంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరీ ఆలస్యం చేయకుండా సుమారు ఓ అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు కాంగ్రెస్ చర్చిస్తుందని తెలిసింది. ఇందులో ముఖ్యంగా మూడు స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫాం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. వనపర్తి అభ్యర్థి జి.చిన్నారెడ్డి, చేవెళ్ల అభ్యర్థి భీంభరత్, బోథ్ అభ్యర్థి వన్నెల అశోక్ కు బీం ఫామ్ లు ఇవ్వొద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు టాక్. ఈ ముగ్గురు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం ఎలాంటి కసరత్తులు చేయడం లేదని తెలిసింది. అందుకే వీళ్ల స్థానాల్లో ఇతర నాయకులను ప్రకటించి, అప్పుడు బీం ఫామ్ లు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు సమాచారం.

This post was last modified on November 6, 2023 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago