Political News

రాహుల్, ప్రియాంక క్యాంపేస్తారా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన సర్వేలన్నీ మిశ్రమ స్పందననే చూపించాయి. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని చెబితే మరికొన్ని సర్వేలు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వచ్చి ఆగిపోతుందని, రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఫలితాలను వెల్లడించాయి. దాంతో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధి, ప్రియాంకగాంధీలను పదేపదే తెలంగాణాలో పర్యటించేట్లుగా చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా వీళ్ళిద్దరినీ రెండు వారాలపాటు తెలంగాణాలోనే క్యాంపు వేయమని అడిగారట. ఇందుకు వీళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారని పార్టీవర్గాల సమాచారం. నామినేషన్ల ప్రక్రియ 10వ తేదీన అయిపోతోంది. తర్వాత ఉపసంహరణలు కూడా అయిపోతాయి. అప్పుడు నికరంగా అభ్యర్ధులు ఎవరన్నది తేలుతుంది. అందుకనే 15వ తేదీనుండి వీళ్ళద్దరితో విస్తృతంగా ప్రచారం చేయించాలని పీసీసీ అనుకున్నది.

ఇందుకనే వీళ్ళ పర్యటనలకు వీలుగా షెడ్యూళ్ళని కూడా రెడీచేస్తోంది. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ప్రచారానికి వీలుగా పార్టీ రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నది. ఇందులో ఒక హెలికాప్టర్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరోటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కేటాయించారు. అంటే అవసరాలకు కాస్త అటుఇటు అవసరాలకు అనుగుణంగా ఇతరులు కూడా ఉపయోగించే వెసులుబాటు పెట్టుకున్నారు. కాబట్టి ఈ రెండు హెలికాప్టర్లను రాహుల్, ప్రియాంక పర్యటనలకు కేటాయించబోతున్నారు.

ఎలాగు వీళ్ళ పర్యటనల్లో రేవంత్, భట్టి తదితరులు ఉండటం ఖాయమే. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలోనే రాహుల్, ప్రియాంకలు పర్యటనలు జరిగినట్లుంటుంది, హెలికాప్టర్లు వీళ్ళ ఆధీనంలోనే ఉన్నట్లుంటుందని పార్టీవర్గాలు చెప్పాయి. వీళ్ళ పర్యటనలను కూడా కాస్త కష్టపడితే గెలుపు ఖాయమని అనుకుంటున్న నియోజకవర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలకు రెండో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. గెలుపు అనుమానమే అని ఫీడ్ బ్యాక్ వచ్చిన నియోజకవర్గాలను మూడో జాబితాలో చేర్చారట. మరి వీళ్ళ పర్యటనల ద్వారా పార్టీ ఏమేరకు పుంజుంకుంటుందో చూడాలి.

This post was last modified on November 6, 2023 12:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

13 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

56 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago