మొదటి నుంచి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రయాణం సాగిస్తున్న సీనియర్ నాయకుడు ఆయన. 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మరోసారి వైఎస్సార్ ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ వరుసగా ఓటములు ఆయన రాజకీయ జీవితానికి బ్రేకులేశాయి. కానీ పట్టు వదలకుండా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తుండటం, పైగా ఆ సీనియర్ నేత కూడా గెలుపుపై విశ్వాసంతో మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే షాక్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోసం ఆయన సీటు త్యాగం చేయక తప్పడం లేదు. ఆ నాయకుడే మహమ్మద్ షబ్బీర్ అలీ.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షబ్బీర్ అలీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటివరకూ టికెట్ ప్రకటించకపోయినా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం షబ్బీర్ అలీకి శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని అక్కడ బరిలో దించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ రేవంత్ సమరానికి సై అనబోతున్నారు.
కానీ ఇప్పుడు షబ్బీర్ అలీ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కామారెడ్డి నుంచి 1989 నుంచి వరుసగా ఏడు సార్లు పోటీ చేసిన షబ్బీర్ అలీ 1989, 2004లో మాత్రమే గెలిచారు. 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి చేతిలో ఓడారు. ఓ వైపు వరుసగా ఓటములు ఎదురవుతున్నా.. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలను షబ్బీర్ అలీ కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కామారెడ్డి టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి ఆయన్ని నిజామాబాద్ ఆర్బన్ నుంచి పోటీ చేయించేందుకు హైకమాండ్ నిర్ణయించిందని టాక్. కానీ తనది కానీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీ గెలుస్తారా? అన్నది చూడాలి. పైగా నిజామాబాద్ అర్బన్ టికెట్ షబ్బీర్ అలీకి ఇస్తే ఈ సీటు ఆశిస్తున్న సంజయ్ తిరుగుబావుటా ఎగరేసే అవకాశముంది. మరి ఈ పరిస్థితుల్లో షబ్బీర్ రాజకీయ జీవితం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on November 6, 2023 7:31 am
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…
నేను కూడా సైబర్ బాదితుడినే… అందుకే వారానికోసారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మారుస్తుంటానని చెప్పారు హీరో నాగార్జున. కంప్యూటర్ విప్లవం…
టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా మారిపోయింది. జనవరి తర్వాత రెండు మూడు…
ప్రభాస్ సోషల్ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఇక అందులోనూ చాలా అరుదుగా పర్సనల్ ప్రొఫైల్ మార్పులు కనిపిస్తుంటాయి. దాదాపు…
అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన…