మొదటి నుంచి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రయాణం సాగిస్తున్న సీనియర్ నాయకుడు ఆయన. 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మరోసారి వైఎస్సార్ ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ వరుసగా ఓటములు ఆయన రాజకీయ జీవితానికి బ్రేకులేశాయి. కానీ పట్టు వదలకుండా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తుండటం, పైగా ఆ సీనియర్ నేత కూడా గెలుపుపై విశ్వాసంతో మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే షాక్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోసం ఆయన సీటు త్యాగం చేయక తప్పడం లేదు. ఆ నాయకుడే మహమ్మద్ షబ్బీర్ అలీ.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షబ్బీర్ అలీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటివరకూ టికెట్ ప్రకటించకపోయినా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం షబ్బీర్ అలీకి శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని అక్కడ బరిలో దించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ రేవంత్ సమరానికి సై అనబోతున్నారు.
కానీ ఇప్పుడు షబ్బీర్ అలీ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కామారెడ్డి నుంచి 1989 నుంచి వరుసగా ఏడు సార్లు పోటీ చేసిన షబ్బీర్ అలీ 1989, 2004లో మాత్రమే గెలిచారు. 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి చేతిలో ఓడారు. ఓ వైపు వరుసగా ఓటములు ఎదురవుతున్నా.. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలను షబ్బీర్ అలీ కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కామారెడ్డి టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి ఆయన్ని నిజామాబాద్ ఆర్బన్ నుంచి పోటీ చేయించేందుకు హైకమాండ్ నిర్ణయించిందని టాక్. కానీ తనది కానీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీ గెలుస్తారా? అన్నది చూడాలి. పైగా నిజామాబాద్ అర్బన్ టికెట్ షబ్బీర్ అలీకి ఇస్తే ఈ సీటు ఆశిస్తున్న సంజయ్ తిరుగుబావుటా ఎగరేసే అవకాశముంది. మరి ఈ పరిస్థితుల్లో షబ్బీర్ రాజకీయ జీవితం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on November 6, 2023 7:31 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…