తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్పార్టీల మధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపుచెక్కతో నే రెండంటా! అంటూ.. నాయకు లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల దాడిని మరింత పెంచారు. ప్రాజెక్టుల కుంగుబాటు.. అవినీతి అంశాలతోపాటు 9 గంటల విద్యుత్ అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా “కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు” అంటూ.. రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. ఇదంతా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతికి తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకోవడమేనని నిప్పులు చెరిగారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత కూడా కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అంటే.. కేరాఫ్ కరెప్షన్ అంటూ.. రాహుల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మరోసారి చెప్పుకొచ్చారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ప్రత్యక్షంగా చూశా. చాలా దారుణం. తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా తినేశారో.. ఇక్కడ ప్రతి పిల్లర్ చెబుతుంది” అని రాహుల్ అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేనని రాహుల్ అన్నారు. ఆ పార్టీలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగానే పని చేస్తున్నాయని విమర్శించారు. దొరల సర్కారును పారదోలి ప్రజల సర్కార్ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా రాహుల్ గాంధీ మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
This post was last modified on November 2, 2023 2:57 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…