తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. పార్టీలు మారటంలో వివేక్ ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ లోనే స్ధిరంగా ఉంటారా లేకపోతే మళ్ళీ మారిపోతారా అని అడుగుతున్నారు.
వివేక్ సిక్స్ టైమ్స్ జంప్ అంటు సరదాగా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. సిక్స్ టైమ్స్ జంప్ అని ఎందుకన్నారంటే వివేక్ కుటుంబానికి వీ సిక్స్ పేరుతో ఒక ఛానల్ ఉండటమే. మాజీ ఎంపీ వివేక్ ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు వచ్చినపుడల్లా పార్టీలు మారిపోవటం వివేక్ కు అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. తరచూ పార్టీలు మారుతు తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి పరువు తీస్తున్నారంటు నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు.
అప్పుడెప్పుడో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వివేక్ మళ్ళీ గెలిచిందిలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదనుకున్నారు. అందుకనే బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఎంపీగా టికెట్ దక్కకపోవటంతో మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. తనకు సరైన గుర్తింపు దక్కటంలేదని అలిగి చివరకు బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీలో లాభంలేదని అనుకుని మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వివేక్ కు పార్టీ ముఖ్యంకాదు తన ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్నిసార్లయినా ఎన్నిపార్టీలైనా మారుతారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా వివేక్ పట్టించుకోరు. ఎందుకంటే వివేక్ కు ప్రత్యేకంగా ఒక కమిట్మెంట్ అన్నది లేదు కాబట్టే. వివేక్ మొదటినుండి పార్టీకి కాకుండా పదవులకు మాత్రమే లాయల్ గా ఉంటున్నారు. అందుకనే ఎలాంటి మొహమాటాలు లేకుండా ఇన్నిసార్లు ఇన్ని పార్టీలు మారగలుగుతున్నారు.
This post was last modified on November 2, 2023 10:50 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…