Political News

జానారెడ్డి కమిటి ఫెయిలైందా ?

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ టికెట్ల ప్రకటన తర్వాత కచ్చితంగా కొందరు నేతల్లో అసంతృప్తులు బయటపడతాయని అధిష్టానం ముందుగానే గుర్తించింది. అందుకనే అసంతృప్తులను బుజ్జగించి వాళ్ళని పార్టీలోనే కంటిన్యు అయ్యేట్లుగా ఒప్పించి, అభ్యర్ధుల గెలుపుకు సహకరించేట్లుగా ఒప్పించేందుకు ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీమంత్రి జానారెడ్డి ఉన్నారు. సభ్యులుగా మాణిక్ రావ్ థాక్రే, మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.

పార్టీ టికెట్లు ప్రకటిస్తోంది, అసంతృప్తులు రెచ్చిపోతున్నారు, కాంగ్రెస్ కు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అసంతృప్తనేతలు గాంధీభవన్ కు వచ్చి నానా గోలచేస్తున్నారు. పార్టీలో ఇంతజరుగుతున్నా జానారెడ్డి కమిటి ఏమిచేస్తున్నట్లు ? ఏమీ చేయటంలేదు జరుగుతున్న గొడవలను జస్ట్ చూస్తు కూర్చున్నదంతా. ఎందుకంటే టికెట్ వచ్చిన తన కొడుకును గెలిపించుకునే విషయంలో జానారెడ్డి బిజీగా ఉన్నారు. ఇక థాక్రే ఏమో టికెట్ల ఖరారు మీటింగుల్లో ఢిల్లీలో తీరికలేకుండా ఉన్నారు.

మిగిలిన ఇద్దరు సభ్యులు మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీకి రాష్ట్ర రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదు. కాబట్టి వీళ్ళకి పార్టీ నేతలు తెలీదు, పార్టీ నేతలకు వీళ్ళెవరో తెలీదు. అందుకనే వీళ్ళిద్దరు కూడా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవటంలేదు. దీని ఫలితం ఏమైందంటే టికెట్లు దక్కని అసంతృప్త నేతలను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దాంతో అసంతృప్త నేతలంతా మండిపోతు గొడవలు చేస్తున్నారు లేకపోతే రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోతున్నారు.

మామూలుగా ఏ పార్టీలో అయినా జరిగే తంతు ఇదే. కాకపోతే టికెట్లు దక్కని నేతలను పార్టీలోని సీనియర్లు దగ్గర కూర్చుని ఏదో ఒక హామీతో బుజ్జగించటం చాలా సహజం. అవసరమైతే పార్టీ అగ్రనేతలతో ఫోన్లో మాట్లాడించి ఏదో ఒక హామీ ఇప్పిస్తారు. దాంతో చాలామంది అసంతృప్త నేతలు తమ అలక వీడి మళ్ళీ పార్టీలో కంటిన్యు అవుతారు. అయితే ఈ ప్రాసెస్ చాలా స్పీడుగా జరగాలి. ఎందుకంటే అసంతృప్తనేతలు పదుల సంఖ్యలో ఉంటారు కాబట్టి బుజ్జగింపుల కమిటిలో సభ్యులు చాలా స్పీడుగా ఉండాలి. కానీ కాంగ్రెస్ లో కమిటి ఉంది కానీ పనిచేయటంలేదు. అందుకనే జానారెడ్డి కమిటి ఫెయిలైందని అనుకుంటున్నారు.

This post was last modified on October 30, 2023 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

15 minutes ago

నా ఉద్దేశం అది కాదంటున్న అనన్య

చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ్‌లోకి మార్చి, వాటి ద్వారా హాట్…

22 minutes ago

మళ్ళీ వస్తామంటున్న ‘యువ’ జంట

టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…

46 minutes ago

దీపిక ప్ర‌క‌ట‌న‌… మ‌రి రాకా ప‌రిస్థితేంటి?

రాకా.. ప్ర‌స్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒక‌టి. పుష్ప‌-2 లాంటి సెన్సేష‌నల్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్…

2 hours ago

డార్లింగ్ క్రేజ్ ఇంకా తగ్గలేదే

పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…

3 hours ago

OTT రూటు… ఇది కరెక్టు పాయింటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…

3 hours ago