ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ భలేగా కలిసి వచ్చాయి. ఆ కలిసి వచ్చిన అంశాల్లో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం చేసిన క్యాంపైనింగ్ కూడా చాలా కీలకమే. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఆ సంస్థ చేసిన కొన్ని కార్యక్రమాలు, నడిపిన యాంటీ క్యాంపైనింగ్స్ వైసీపీకి బాగా ప్లస్ అయ్యాయి. రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని స్థాయిలో కొన్ని దారుణమైన ప్రచారాలు చేయడం, కుల కుంపట్లు రాజేయడంలో కూడా ఐప్యాక్ టీంది కీలక పాత్రగా భావిస్తారు రాజకీయ విశ్లేషకులు.
ఇందుకోసం పీకే వందల కోట్లు పుచ్చుకున్నారని ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ బిజినెస్ లెక్కల సంగతి పక్కన పెడితే జగన్కు ఎప్పట్నుంచో పీకే మిత్రుడిగా ఉంటున్నాడు. ఈ ఎన్నికల ముందు కూడా వైసీపీ కోసం పీకే టీం పని చేస్తున్నట్లే చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా పీకే ఒక చర్చా వేదికలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల గురించి పీకే ఈ కార్యక్రమంలో మాట్లాడాడు. జనాలకు ఉచిత పథకాల రూపంలో డబ్బులు పంచడం బాగానే ఉంటుందని.. కానీ సంపద సృష్టించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పీకే అన్నాడు.
అతనేమీ ఏపీ పేరు ప్రస్తావించకుండా యథాలాపంగా ఏమీ ఈ మాట అనలేదు. పర్టికులర్గా ఏపీ ప్రస్తావన తెచ్చి అక్కడ సంపద సృష్టి జరగకుండా సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు పంచుతున్నారని.. దీని వల్ల ఇబ్బందే అని పీకే వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ కోసం పని చేసే మిత్రుడే ఈ మాట అన్నాడంటే.. జగన్ సర్కారు ఎంత తప్పు చేస్తోందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీకే ఈ మాట అన్నాడంటే ఐప్యాక్ టీం జగన్ పార్టీ, ప్రభుత్వం కోసం పని చేస్తోందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 29, 2023 10:39 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…