Political News

బీసీలను బ్యాలెన్స్ చేసిన కాంగ్రెస్

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు పెద్ద పీట వేసినట్లే కనబడుతోంది. ఇప్పటికి ప్రకటించిన 100 సీట్లలో 20 నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు దక్కాయి. పెండింగులో ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో కూడా ఐదుగురు బీసీ నేతలకు టికెట్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే హోలు మొత్తంమీద 25 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినట్లవుతుంది. నిజానికి 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలన్నది బీసీ నేతల డిమాండ్.

అయితే బీసీల డిమాండు ప్రకారం 34 సీట్లు కేటాయిస్తే అగ్రవర్ణాల్లోని మిగిలిన కులాల్లో గోల పెరిగిపోతుంది. మొత్తం జనాభాలో బీసీల జనాభా సగం అన్నది వాస్తవమే అయినా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి దామాషా ప్రకారం కేటాయింపులు సాధ్యంకావని అందరికీ తెలుసు. బీసీ నేతలు 34 టికెట్లు కావాలని డిమాండ్లు చేస్తే పార్టీ 25 టికెట్లు కేటాయిస్తోంది. పైగా కేటాయింపు కూడా సీనియర్లు, ఇతర పార్టీల నుండి చేరిన వాళ్ళ మధ్య బ్యాలెన్స్ చేసుకున్న విషయం అర్ధమవుతోంది.

అందుకనే బీసీ నేతలు, సంఘాల నుండి పెద్దగా ప్రతిఘటన, ఆందోళనలు ఎదురుకావటంలేదు. అధిష్టానం నిర్ణయంపై బీసీ నేతల్లో కూడా చాలామంది హ్యాపీగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ అయితే బీసీలకు కేటాయించిన సీట్లు 22 మాత్రమే. అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ అదనంగా మూడు సీట్లను కేటాయించినట్లే అని స్పష్టమవుతోంది. కమ్మలు, బ్రాహ్మణ సామాజికవర్గాలకు కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ లో ఎక్కువ సీట్లే దక్కినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో టికెట్ల కేటాయింపులో అంతా కేసీయార్ ఇష్టప్రకారమే ఏకపక్షంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. అసంతృప్త నేతలు తమ గోడు చెప్పుకోవడానికి కూడా కేసీయార్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే రోజుల తరబడి సీనియర్ నేతలను దగ్గర కూర్చోబెట్టుకుని అధిష్టానంలోని కీలక నేతలు చర్చలు జరిపి టికెట్లను ఫైనల్ చేశారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అర్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక వరకు ఓకేనే మరి ప్రచారం, ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago