Political News

బీసీలను బ్యాలెన్స్ చేసిన కాంగ్రెస్

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు పెద్ద పీట వేసినట్లే కనబడుతోంది. ఇప్పటికి ప్రకటించిన 100 సీట్లలో 20 నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు దక్కాయి. పెండింగులో ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో కూడా ఐదుగురు బీసీ నేతలకు టికెట్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే హోలు మొత్తంమీద 25 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినట్లవుతుంది. నిజానికి 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలన్నది బీసీ నేతల డిమాండ్.

అయితే బీసీల డిమాండు ప్రకారం 34 సీట్లు కేటాయిస్తే అగ్రవర్ణాల్లోని మిగిలిన కులాల్లో గోల పెరిగిపోతుంది. మొత్తం జనాభాలో బీసీల జనాభా సగం అన్నది వాస్తవమే అయినా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి దామాషా ప్రకారం కేటాయింపులు సాధ్యంకావని అందరికీ తెలుసు. బీసీ నేతలు 34 టికెట్లు కావాలని డిమాండ్లు చేస్తే పార్టీ 25 టికెట్లు కేటాయిస్తోంది. పైగా కేటాయింపు కూడా సీనియర్లు, ఇతర పార్టీల నుండి చేరిన వాళ్ళ మధ్య బ్యాలెన్స్ చేసుకున్న విషయం అర్ధమవుతోంది.

అందుకనే బీసీ నేతలు, సంఘాల నుండి పెద్దగా ప్రతిఘటన, ఆందోళనలు ఎదురుకావటంలేదు. అధిష్టానం నిర్ణయంపై బీసీ నేతల్లో కూడా చాలామంది హ్యాపీగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ అయితే బీసీలకు కేటాయించిన సీట్లు 22 మాత్రమే. అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ అదనంగా మూడు సీట్లను కేటాయించినట్లే అని స్పష్టమవుతోంది. కమ్మలు, బ్రాహ్మణ సామాజికవర్గాలకు కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ లో ఎక్కువ సీట్లే దక్కినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో టికెట్ల కేటాయింపులో అంతా కేసీయార్ ఇష్టప్రకారమే ఏకపక్షంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. అసంతృప్త నేతలు తమ గోడు చెప్పుకోవడానికి కూడా కేసీయార్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే రోజుల తరబడి సీనియర్ నేతలను దగ్గర కూర్చోబెట్టుకుని అధిష్టానంలోని కీలక నేతలు చర్చలు జరిపి టికెట్లను ఫైనల్ చేశారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అర్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక వరకు ఓకేనే మరి ప్రచారం, ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

This post was last modified on October 28, 2023 4:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

1 hour ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

6 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

6 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

7 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

9 hours ago