Political News

2024లో చంద్ర‌బాబు.. ఛ‌స్తాడు!: వైసీపీ ఎంపీ

వైసీపీ నాయ‌కుడు, న్యూడ్ ఎంపీగా అంద‌రికీ గుర్తుండి పోయిన‌.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సెంట్రిక్‌గా ఆయ‌న నోరు పారేసుకున్నా రు. 2024 ఎన్నిక‌ల స‌మయంలోనే చంద్ర‌బాబు ఛ‌స్తాడ‌ని.. జ‌గ‌నే మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతార‌ని మాధ‌వ్ వ్యాఖ్యానించారు. వైసీపీ చేప‌ట్టిన సామాజిక న్యాయ యాత్ర‌లో భాగంగా.. హిందూపురంలో శుక్ర‌వారం ప‌ర్య‌టించిన మాధ‌వ్‌.. టీడీపీపై విమ‌ర్శ‌లు చేశారు.

“చంద్ర‌బాబు ఒక‌ప్పుడు నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ‌స్సు యాత్ర‌లు చేశాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చేది లేదు. వ‌చ్చినా.. 2024 ఎన్నిక‌లకు ముందే ఛ‌స్తాడు. ఇక‌, సీఎం జ‌గ‌నే., ఆయ‌న‌ను ఎద‌రించే నాయ‌కులు కూడా లేరు. ప‌వ‌న్ సినిమాల దారి చూసుకుంటాడు” అని మాధ‌వ్ వ్యాఖ్యానించారు.

ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పైనా మాధ‌వ్ నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తి చేసి.. ప్ర‌స్తుతం పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేసే ద‌మ్ము ఈ రెండు పార్టీల‌కూ లేద‌న్నారు. టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడన్నారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టి పెట్టి పారిపోయాడని గోరంట్ల మాధవ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇదిలావుంటే.. జైల్లో ఉన్న చంద్ర‌బాబును చంపేందుకు వైసీపీ నేత‌లు కుట్ర ప‌న్నుతున్నారంటూ.. టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను తీవ్ర అనారోగ్యానికి గురి చేసి.. ఏదో ఒక ర‌కంగా ఆయ‌న‌ను లేకుండా చేయాల‌నే కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ కూడా సందేహాలు వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుకు ఏదైనా జ‌రిగితే.. జ‌గ‌నే బాధ్య‌త వహించాల‌ని కూడా తేల్చి చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో మాధ‌వ్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి.

This post was last modified on October 27, 2023 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago