వైసీపీ నాయకుడు, న్యూడ్ ఎంపీగా అందరికీ గుర్తుండి పోయిన.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సెంట్రిక్గా ఆయన నోరు పారేసుకున్నా రు. 2024 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఛస్తాడని.. జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాధవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయ యాత్రలో భాగంగా.. హిందూపురంలో శుక్రవారం పర్యటించిన మాధవ్.. టీడీపీపై విమర్శలు చేశారు.
“చంద్రబాబు ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు చేశాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చేది లేదు. వచ్చినా.. 2024 ఎన్నికలకు ముందే ఛస్తాడు. ఇక, సీఎం జగనే., ఆయనను ఎదరించే నాయకులు కూడా లేరు. పవన్ సినిమాల దారి చూసుకుంటాడు” అని మాధవ్ వ్యాఖ్యానించారు.
ఇక, జనసేన అధినేత పవన్పైనా మాధవ్ నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తి చేసి.. ప్రస్తుతం పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ఈ రెండు పార్టీలకూ లేదన్నారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడన్నారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టి పెట్టి పారిపోయాడని గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు.
ఇదిలావుంటే.. జైల్లో ఉన్న చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను తీవ్ర అనారోగ్యానికి గురి చేసి.. ఏదో ఒక రకంగా ఆయనను లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే.. జగనే బాధ్యత వహించాలని కూడా తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో మాధవ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
This post was last modified on October 27, 2023 10:42 am
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…