వైసీపీ నాయకుడు, న్యూడ్ ఎంపీగా అందరికీ గుర్తుండి పోయిన.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సెంట్రిక్గా ఆయన నోరు పారేసుకున్నా రు. 2024 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఛస్తాడని.. జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాధవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయ యాత్రలో భాగంగా.. హిందూపురంలో శుక్రవారం పర్యటించిన మాధవ్.. టీడీపీపై విమర్శలు చేశారు.
“చంద్రబాబు ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు చేశాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చేది లేదు. వచ్చినా.. 2024 ఎన్నికలకు ముందే ఛస్తాడు. ఇక, సీఎం జగనే., ఆయనను ఎదరించే నాయకులు కూడా లేరు. పవన్ సినిమాల దారి చూసుకుంటాడు” అని మాధవ్ వ్యాఖ్యానించారు.
ఇక, జనసేన అధినేత పవన్పైనా మాధవ్ నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తి చేసి.. ప్రస్తుతం పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ఈ రెండు పార్టీలకూ లేదన్నారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడన్నారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టి పెట్టి పారిపోయాడని గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు.
ఇదిలావుంటే.. జైల్లో ఉన్న చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను తీవ్ర అనారోగ్యానికి గురి చేసి.. ఏదో ఒక రకంగా ఆయనను లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే.. జగనే బాధ్యత వహించాలని కూడా తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో మాధవ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
This post was last modified on October 27, 2023 10:42 am
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…