Political News

జగన్ పాలన నుంచి స్వాతంత్ర్యం కావాలి: భువనేశ్వరి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక వందలాది మంది కార్యకర్తలు హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి ‘నిజం గెలవాలి’ పేరుతో ఓదార్పు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు ఈ ఓదార్పు యాత్ర శ్రీకాళహస్తిలో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో భువనేశ్వరి ఏపీ ప్రభుత్వంపై, జగన్ పాలనపై నిప్పులు చెరిగారు.

ఆనాడు బ్రిటిష్ వారితో స్వాతంత్ర్య పోరాటం ప్రజలు చేయాల్సి వచ్చిందని, ఈనాడు జగన్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం ఏపీ ప్రజలు పోరాడాల్సి వస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న ఎన్టీఆర్ పౌరుషం, చంద్రబాబు పోరాట పటిమతో పోరాడదామని, విజయం తథ్యం అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

గతంలో తిరుమలకు ఎప్పుడు వెళ్లినా నలుగురు కుటుంబ సభ్యులం వెళ్లేవారమని, ఇపుడు తాను ఒక్కదాన్నే రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్దోషి అని తాను గ్యారెంటీ ఇస్తున్నానని భువనేశ్వరి అన్నారు. సీఐడీ వారు ఏం విచారణ చేసినా భయపడబోమని, వారు టీడీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. పవన్ తో మాట్లాడినపుడు ఆయన కూడా తమలాగే ఆలోచిస్తున్నారని అర్థమైందని చెప్పారు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళతాయని, లోకేష్ త్వరలోనే పాదయాత్ర మొదలుపెడతారని అన్నారు.

ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో, రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం ఏర్పరచడంలో ఈ ప్రభుత్వం ముందుందని దుయ్యబట్టారు. కానీ,పరిశ్రమలను తీసుకురావడంలో మాత్రం వెనుకబడిందని, అందుకే పక్క రాష్ట్రాలకు పరిశ్రమలు తరలివెళుతున్నాయని, ఏపీ యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on October 26, 2023 10:04 pm

Share

Recent Posts

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

53 minutes ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

1 hour ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

1 hour ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

1 hour ago

చిరు భలే బోల్తా కొట్టించాడుగా

ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…

3 hours ago

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

4 hours ago