Political News

మా ఆయ‌న కు ఓటేయొద్దు.. మా ఆవిడ కు ఓటేయొద్దు

త‌మ్ముడు.. త‌మ్ముడే, రాజ‌కీయం.. రాజ‌కీయ‌మే అన్న‌ట్టుగా ఉంది రాజ‌స్థాన్ ప‌రిస్థితి. దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని కొన్ని చోట్ల చిత్ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఒకే స్థానం నుంచి బ‌రిలో నిల‌వ‌డం.. బాబాయి.. అబ్బాయి క‌లిసి ఒకే సీటు నుంచి అదృష్టం ప‌రీక్షించుకోవ‌డం వంటివి మ‌న‌కు తెలిసిందే.

అదేవిధంగా మ‌న ఏపీలోనూ 2019 ఎన్నిక‌ల్లో తండ్రీ కూతురు(కిశోర్ చంద్ర‌దేవ్‌, ఆయ‌న కుమార్తె) ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి వార్త‌ల్లోకి ఎక్కారు. ఇక‌, ఇప్పుడు రాజ‌స్థాన్‌లో మ‌రో అడుగు ముందుకు వేశారు భార్యాభ‌ర్త‌లు. ఇక్క‌డి రామ్‌గ‌డ్ అసెంబ్లీ స్థానానికి చెందిన వీరేంద్ర సింగ్‌, రీటా చౌధురిలు భార్యాభ‌ర్త‌లు. వీరిద్ద‌రూ ప్రేమించి మ‌రీ పెళ్లి చేసుకున్నారు. ఉన్న‌త‌స్థాయి ఫ్యామిలీలు.

ఇక‌, రాజ‌కీయాల్లోనూ ఈ భార్యాభ‌ర్త‌లు ఒకే పార్టీలో కొన్నేళ్లుగా ప‌నిచేస్తున్నారు. కాంగ్రెస్ కీల‌క నాయ‌కులుగా జిల్లాలోను, రాష్ట్రంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలో తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ పోరులో భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ టికెట్లు ఆశించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం వీరేంద్ర సింగ్‌కు మాత్ర‌మే రామ్‌గ‌డ్ అసెంబ్లీ సీటును కేటాయించింది. రీటా చౌధురికి టికెట్ ఇవ్వ‌లేదు.

దీంతో అలిగిన రీటా.. వెంట‌నే స్థానికంగా కీల‌క పార్టీ అయిన‌ జ‌న నాయ‌క్ జ‌న‌తా పార్టీ(జేజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే ఆమెకు రామ్‌గ‌డ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఈ పార్టీ ఇచ్చేసింది. ఇంకేముంది.. విజ‌య ద‌శమి సంద‌ర్భంగా.. అటు భ‌ర్త‌, ఇటు భార్య‌.. ఒకేసారి నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఒక‌రు కాంగ్రెస్ త‌ర‌ఫున‌, ఒక‌రు జేజేపీ త‌ర‌ఫున ఒకే స్థానం నుంచి పోటీ ప‌డుతుండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఈ సంద‌ర్భంగా భార్యా భ‌ర్త‌లు వేర్వేరుగా ప్రెస్‌తో మాట్లాడుతూ.. ఒక‌రిపై ఒక‌రు తొలిసారి విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. నేను హోం మేక‌ర్‌. మ‌హిళ‌లు ప‌డే క‌ష్టాలు నాకు తెలుసు. వారికి అండ‌గా ఉంటా. అదేవిధంగా ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా తీరుస్తా. మా ఆయ‌న ప‌క్కా తాగుబోతు. కుటుంబ భారం అంతా నేనే మోస్తా. ఈ విష‌యం గ్ర‌హించి మ‌హిళ‌లు నాకే ఓటేయాలి– అని రీటా చౌధ‌రి వ్యాఖ్యానించారు.

ఇక‌, వీరేంద్ర‌సింగ్ కూడా ఇదే త‌ర‌హాలో మాట్లాడారు. 'ఔను.. నిజ‌మే మా ఆవిడ హొం మేక‌రే. కానీ బ‌ద్ధ‌కిస్టు. మొగుడికి అన్నం పెట్టి .. మంచి నీళ్లు నువ్వే తెచ్చుకునే అనే టైపు.' ఆవిడ‌కు ఓట్లేస్తే.. ఇక్క‌డి ప్ర‌జ‌లకు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వు. నేను ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు అన్న‌య్య‌, త‌మ్ముడి లాంటోడిని. సో.. నాకే ఓటేయాలి అని సింగ్ అన్నారు. మొత్తానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయం ఇప్పుడు దేశంలోనే సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on October 25, 2023 11:51 am

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

2 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

2 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

2 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

3 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

3 hours ago