తమ్ముడు.. తమ్ముడే, రాజకీయం.. రాజకీయమే అన్నట్టుగా ఉంది రాజస్థాన్ పరిస్థితి. దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే స్థానం నుంచి బరిలో నిలవడం.. బాబాయి.. అబ్బాయి కలిసి ఒకే సీటు నుంచి అదృష్టం పరీక్షించుకోవడం వంటివి మనకు తెలిసిందే.
అదేవిధంగా మన ఏపీలోనూ 2019 ఎన్నికల్లో తండ్రీ కూతురు(కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె) ఒకే నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇక, ఇప్పుడు రాజస్థాన్లో మరో అడుగు ముందుకు వేశారు భార్యాభర్తలు. ఇక్కడి రామ్గడ్ అసెంబ్లీ స్థానానికి చెందిన వీరేంద్ర సింగ్, రీటా చౌధురిలు భార్యాభర్తలు. వీరిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఉన్నతస్థాయి ఫ్యామిలీలు.
ఇక, రాజకీయాల్లోనూ ఈ భార్యాభర్తలు ఒకే పార్టీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నాయకులుగా జిల్లాలోను, రాష్ట్రంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ పోరులో భార్యా భర్తలు ఇద్దరూ టికెట్లు ఆశించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం వీరేంద్ర సింగ్కు మాత్రమే రామ్గడ్ అసెంబ్లీ సీటును కేటాయించింది. రీటా చౌధురికి టికెట్ ఇవ్వలేదు.
దీంతో అలిగిన రీటా.. వెంటనే స్థానికంగా కీలక పార్టీ అయిన జన నాయక్ జనతా పార్టీ(జేజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే ఆమెకు రామ్గడ్ నియోజకవర్గాన్ని ఈ పార్టీ ఇచ్చేసింది. ఇంకేముంది.. విజయ దశమి సందర్భంగా.. అటు భర్త, ఇటు భార్య.. ఒకేసారి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు జేజేపీ తరఫున ఒకే స్థానం నుంచి పోటీ పడుతుండడం సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా భార్యా భర్తలు వేర్వేరుగా ప్రెస్తో మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరు తొలిసారి విమర్శలు గుప్పించుకున్నారు. నేను హోం మేకర్. మహిళలు పడే కష్టాలు నాకు తెలుసు. వారికి అండగా ఉంటా. అదేవిధంగా ఇతర సమస్యలు కూడా తీరుస్తా. మా ఆయన పక్కా తాగుబోతు. కుటుంబ భారం అంతా నేనే మోస్తా. ఈ విషయం గ్రహించి మహిళలు నాకే ఓటేయాలి
– అని రీటా చౌధరి వ్యాఖ్యానించారు.
ఇక, వీరేంద్రసింగ్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. 'ఔను.. నిజమే మా ఆవిడ హొం మేకరే. కానీ బద్ధకిస్టు. మొగుడికి అన్నం పెట్టి .. మంచి నీళ్లు నువ్వే తెచ్చుకునే అనే టైపు.' ఆవిడకు ఓట్లేస్తే.. ఇక్కడి ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు. నేను ఇక్కడ ప్రజలకు అన్నయ్య, తమ్ముడి లాంటోడిని. సో.. నాకే ఓటేయాలి
అని సింగ్ అన్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది.
This post was last modified on October 25, 2023 11:51 am
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…