రాజమండ్రి జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్లో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో వారాహి యాత్ర, భవిష్యత్తుకు గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు తప్ప మిగతా అంశాలపై ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దసరా నాడు ఇరు పార్టీల నేతలు భేటీ కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఒక తీర్మానం, వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలను రక్షించాలని రెండో తీర్మానం, రాష్ట్రాభివృద్ది కోసం టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశామని లోకేష్ అన్నారు. నవంబర్ 1వ తేదీన టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వేధింపులకు గురి చేస్తున్నారని, తప్పు చేయని చంద్రబాబును జైలులో ఉంచారని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని లోకేష్ ఆరోపించారు. ప్రజా సమస్యళ పరిష్కారినికే రెండు పార్టీల నేతలు సమావేశమయ్యామని అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉద్యోగాల కోసం యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని అన్నారు.
This post was last modified on October 23, 2023 8:22 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…