వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) టోల్ చార్జీల వసూలు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన ఆ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా, బస్ షెల్టర్లు నిర్మించకుండా.. టోల్ చార్జీలు, ప్రకటన చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఈడీ పలు చోట్ల సోదాలు జరిపడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే జీఐపీఎల్ డైరెక్టర్ మేకపాటి విక్రమ్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మేకపాటి విక్రమ్ రెడ్డి స్పందించారు. 50 ఏళ్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తమ సంస్థ ఉందని, పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇటువంటి విచారణలు సాధారణమని అన్నారు. తమ కంపెనీతోపాటు తమతో కలిసి పనిచేస్తున్న మరో కంపెనీపై కూడా విచారణ జరిగిందని తెలిపారు. ఈడీ కోరిన డాక్యుమెంట్లు ఇచ్చామని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని అన్నారు.
ఏది ఏమైనా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇటువంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా స్కాములకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…