Political News

మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) టోల్ చార్జీల వసూలు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన ఆ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా, బస్ షెల్టర్లు నిర్మించకుండా.. టోల్ చార్జీలు, ప్రకటన చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఈడీ పలు చోట్ల సోదాలు జరిపడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే జీఐపీఎల్ డైరెక్టర్ మేకపాటి విక్రమ్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మేకపాటి విక్రమ్ రెడ్డి స్పందించారు. 50 ఏళ్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తమ సంస్థ ఉందని, పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇటువంటి విచారణలు సాధారణమని అన్నారు. తమ కంపెనీతోపాటు తమతో కలిసి పనిచేస్తున్న మరో కంపెనీపై కూడా విచారణ జరిగిందని తెలిపారు. ఈడీ కోరిన డాక్యుమెంట్లు ఇచ్చామని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని అన్నారు.

ఏది ఏమైనా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇటువంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా స్కాములకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

This post was last modified on October 23, 2023 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

3 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

3 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

6 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

7 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

8 hours ago