Political News

ఎన్నాళ్లకెళ్లకు… బెంగళూరు ప్యాలెస్ లో జగన్ బస

నిజమే… ముచ్చటపడి కట్టుకున్న రాజప్రసాదం లాంటి భవంతిలో జగన్ అడుగు పెట్టి చాలా కాలమే అయ్యింది. చాలా కాలమే అంటే… ఏదో కొన్ని రోజులు అనుకునేరు. రోజులు కాదు మూడేళ్లకు పైగానే జగన్ అక్కడ అడుగుపెట్టింది లేదు. అయితే బుధవారం మొత్తం ఆయన సదరు భవంతిలోనే బస చేశారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకుండానే బుధవారమంతా జగన్ సదరు భవంతిలో విశ్రాంతి తీసుకున్నారు. మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి బెంగళూరు వెళ్లిన జగన్… తన సొంతింటిలోనే సేదదీరారు.

తన పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఉన్నత విద్య కోసం పారిస్ లోని టాప్ బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి… మాస్టర్స్ కోసం ఇన్సీడ్ కు వెళుతున్నారు. ఆమెను సాగనంపేందుకు జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి మంగళవారం రాత్రికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున హర్షా రెడ్డి బెంగళూరులోనే పారిస్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఆమెకు అక్కడ వీడ్కోలు పలికిన తర్వాత జగన్ ఫ్యామిలీ తిరిగి తాడేపల్లి చేరుకుంటుంది.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికే బెంగళూరు చేరుకున్న జగన్… విమానాశ్రయం నుంచి నేరుగా కెంపేగౌడలోని తన భవంతికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి అందులోనే రెస్ట్ తీసుకున్న జగన్… బుధవారం కూడా అందులోనే ఉండిపోయారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా… ఈ భవంతిని జగన్ ముచ్చటపడి మరీ కట్టించుకున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో జగన్ ఆ భవంతికి వెళుతున్న సందర్భాలు తగ్గిపోయాయి. అసలు మూడేళ్లుగా జగన్ సదరు భవంతిలో అడుగుపెట్టిందే లేదనే చెప్పాలి. అయితే కూతురు సెండాఫ్ ఇచ్చే సందర్భంగా దొరికిన అవకాశాన్ని జగన్ ఇలా తాను ముచ్చటపడి కట్టుకున్న భవంతిలో రిలాక్స్ డ్ గా గడిపారన్న మాట.

This post was last modified on August 26, 2020 7:55 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

28 seconds ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago