Political News

ఎన్నాళ్లకెళ్లకు… బెంగళూరు ప్యాలెస్ లో జగన్ బస

నిజమే… ముచ్చటపడి కట్టుకున్న రాజప్రసాదం లాంటి భవంతిలో జగన్ అడుగు పెట్టి చాలా కాలమే అయ్యింది. చాలా కాలమే అంటే… ఏదో కొన్ని రోజులు అనుకునేరు. రోజులు కాదు మూడేళ్లకు పైగానే జగన్ అక్కడ అడుగుపెట్టింది లేదు. అయితే బుధవారం మొత్తం ఆయన సదరు భవంతిలోనే బస చేశారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకుండానే బుధవారమంతా జగన్ సదరు భవంతిలో విశ్రాంతి తీసుకున్నారు. మొత్తం కుటుంబ సభ్యులందరితో కలిసి బెంగళూరు వెళ్లిన జగన్… తన సొంతింటిలోనే సేదదీరారు.

తన పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఉన్నత విద్య కోసం పారిస్ లోని టాప్ బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి… మాస్టర్స్ కోసం ఇన్సీడ్ కు వెళుతున్నారు. ఆమెను సాగనంపేందుకు జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి మంగళవారం రాత్రికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున హర్షా రెడ్డి బెంగళూరులోనే పారిస్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఆమెకు అక్కడ వీడ్కోలు పలికిన తర్వాత జగన్ ఫ్యామిలీ తిరిగి తాడేపల్లి చేరుకుంటుంది.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికే బెంగళూరు చేరుకున్న జగన్… విమానాశ్రయం నుంచి నేరుగా కెంపేగౌడలోని తన భవంతికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి అందులోనే రెస్ట్ తీసుకున్న జగన్… బుధవారం కూడా అందులోనే ఉండిపోయారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా… ఈ భవంతిని జగన్ ముచ్చటపడి మరీ కట్టించుకున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో జగన్ ఆ భవంతికి వెళుతున్న సందర్భాలు తగ్గిపోయాయి. అసలు మూడేళ్లుగా జగన్ సదరు భవంతిలో అడుగుపెట్టిందే లేదనే చెప్పాలి. అయితే కూతురు సెండాఫ్ ఇచ్చే సందర్భంగా దొరికిన అవకాశాన్ని జగన్ ఇలా తాను ముచ్చటపడి కట్టుకున్న భవంతిలో రిలాక్స్ డ్ గా గడిపారన్న మాట.

This post was last modified on August 26, 2020 7:55 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

19 mins ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

60 mins ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

1 hour ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

1 hour ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

1 hour ago