Political News

కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా… భలే ఉన్నారే!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర విజయవంతం కావడంతో పార్టీలో కొత్త ఉత్సాహం నిండింది. మూడు రోజుల పాటు రామప్ప నుంచి ఆర్మూరు వరకు సాగిన బస్సు యాత్రలో రాహుల్ గాంధీ ప్రజలతో సాగుతూ.. అధికార బీఆర్ఎస్ ను విమర్శిస్తూ సాగారు. దీంతో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో పార్టీకి మరింత భరోసా రావడంతో పాటు సీనియర్ నాయకులందరూ కలిసికట్టుగా సాగడం పార్టీకి మరింత ఉత్తేజాన్ని కలిగించేదే.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేధాలు తెలియంది కాదు. పార్టీలో ఓ నిర్ణయం తీసుకుంటే వినిపించే అసంత్రుప్తి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో కుంపటి మరింతగా రగులుతూనే ఉంది. సీనియర్ నాయకులంతా పార్టీలో ఆధిపత్యం కోసం పట్టుబడుతూనే ఉన్నారు. టికెట్ల కోసం గొడవ పడుతున్నారు. సీఎం పదవి కోసం ఆశ పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ ఏదైనా కార్యక్రమం చేపడితే నాయకులు తలో తీరుగా వ్యవహరిస్తుంటారనే సంగతి తెలిసిందే. కానీ ఇటీవల రాహుల్ గాంధీ బస్సు యాత్రలో మాత్రం సీనియర్ నాయకులందరూ కలిసి కట్టుగా సాగడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతోంది. సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, సుదర్శన్ రెడ్డి తదితరులు రాహుల్ బస్సు యాత్రలో కలిసి కనిపించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సీనియర్ నాయకులు ఇలాగే కలిసి పార్టీ కోసం పని చేస్తే కాంగ్రెస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

This post was last modified on October 21, 2023 7:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

10 minutes ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

48 minutes ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

2 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

3 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

3 hours ago

మైత్రీకి డబ్బులొచ్చాయ్.. పేరు చెడుతోంది

హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…

3 hours ago