Political News

25.. 40.. కాదు.. 60.. ఇదీ జ‌న‌సేన లెక్క‌?

ఔను! 40 కాదు.. 60 సీట్లు కావాలి! ఇదీ.. ఇప్పుడు జ‌న‌సేన లెక్క‌. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దీనిపై త‌న పార్టీ నాయ‌కుల‌ను ఒప్పించేందుకు ఒకింత శ్ర‌మ‌ప‌డుతున్నారు. ఒంట‌రిగానే పోటీ ఉంటుంద‌ని, ప‌వ‌నే సీఎం అవుతార‌ని, ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి చేయాల‌ని భావించిన పార్టీ కేడ‌ర్‌కు పొత్తులు పెద్ద‌గా న‌చ్చ‌లేదు.

2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి సెంటిమెంటును పిండుకుని.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌య తీరాల‌కు చేరాల‌నే కీల‌క‌మైన కొన్ని సామాజిక వ‌ర్గాల నాయ‌కుల అభిప్రాయం. కానీ, ప‌వ‌న్ ఎవ‌రితో చ‌ర్చించారో… ఏం చేశారో తెలియ‌దు కానీ.. పొత్తుల‌పై ఉత్సాహంగా ప్ర‌క‌ట‌న అయితే చేశారు. కానీ, ఆ త‌ర్వాతే. అస‌లు విష‌యం ఆయ‌న‌కు తెలిసింది. పొత్తుల ప్ర‌క‌ట‌న‌కు ముందు పార్టీ కార్య‌క‌ర్త‌లు అంతో ఇంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ, పొత్తులు ప్ర‌క‌టించాక మౌనం పాటించారు.

ఈ విష‌యంపై నివేదిక‌లు అందుకున్న ప‌వ‌న్‌.. ముందుగానే మేల్కొన‌డం గ‌మ‌నార్హం. వెంట‌నే ఆయ‌న మంగ‌ళ‌గిరిలో కీల‌క నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించి.. పొత్తుల విష‌యాన్ని వారితో చ‌ర్చించారు. ఎందుకు పొత్తుల‌కు వెళ్లాల్సి వ‌చ్చిందో చెప్పారు. మొత్తానికి వారిని ఒప్పించారు. త‌లుపులు మూసేసి నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో పొత్తుల విష‌యాన్ని ఒప్పించినా.. సీట్ల విష‌యానికి వ‌చ్చేస రికి మాత్రం నాయ‌కుల అభిప్రాయాల‌కు ప‌వ‌న్ త‌లూపాల్సి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 25 నుంచి 40 స్థానాల్లో మాత్ర‌మే జ‌న‌సేన పోటీ చేస్తుంద‌నే ప్ర‌చారం ఉంది. ఆమేర‌కే టీడీపీ సీట్లు కేటాయిస్తుంద‌ని టీడీపీ నాయ‌కులు కూడా చూచాయ‌గా చెబుతూ వ‌చ్చారు. దీనిపై జ‌న‌సేన నాయ‌కులు నిర్మొహ‌మాటంగానే ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. 25 కాదు.. 40 కాదు.. 60 సీట్లు కేటాయించాల్సిందే.. మ‌నం కూడా పట్టుబ‌ట్టాల్సిందే అని వారు ప‌వ‌న్ ముందు వారు తెగేసి చెప్పిన‌ట్టు ప్రచారంలో ఉంది. ఇక‌, పొత్తుల‌పై అతిక‌ష్టం మీద కేడ‌ర్‌ను ఒప్పించిన ప‌వ‌న్‌.. ఈ విష‌యంలో పంతం ప‌డితే క‌ష్ట‌మేన‌ని భావించి.. అలాగే చేద్దాం! అని తేల్చి చెప్పారు.

ఇదిలావుంటే, ద‌స‌రా రోజు టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి స‌మావేశం రాజ‌మండ్రిలో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం లో టికెట్ల విష‌యాన్ని ప్ర‌స్తావించి.. ఖ‌రారు చేసుకోవాల‌ని.. జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. సీమ‌లో 25, ఉత్త‌రాంధ్ర నుంచి కోస్తా వ‌ర‌కు 35 స్థానాల‌ను త‌మ‌కు కేటాయించేలా.. టీడీపీపై ఒత్తిడి తేవాల‌నే భావ‌న‌లో ఉన్నారు. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి జ‌న‌సేనలో ఇప్ప‌టికైతే.. పొత్తుల‌పై అసంతృప్తి త‌గ్గింది. మ‌రి సీట్ల‌పై ఎలాంటి నిర్ణ‌యం ఉంటుందో . త‌ర్వాత ప‌రిణామాలు ఎలా మార‌తాయో తేలాల్సి ఉంది.

This post was last modified on October 21, 2023 11:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

19 minutes ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

1 hour ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

1 hour ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

3 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

3 hours ago